రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత వుంది. ఈ జాతర ప్రతి ఏడాది మే నెలలో మండు వేసవిలో వస్తుంటుంది. ఈ ఏడాది మే 6 నుంచి 14వ తేదీ వరకు జాతర నిర్వహించ తలపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ చాటింపుతో జాతర మొదలైంది. ఈ జాతర ప్రత్యేకత ఏమంటే మహిళలు పురుషుల వేషాలు, అలాగే మగవాళ్లు మహిళల వేషాలు వేస్తుంటారు. అలాగే ఇతరత్రా వేషాలు ఎంతో ఆకట్టుకుంటాయి.
కానీ కూటమి పాలనలో గంగజాతరకు ముందే రాజకీయ వేషాలు, చాటింపులు జోరుగా సాగుతున్నాయి. గంగజాతర నిర్వహణ నిమిత్తం రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇద్దరు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు మరికొందరితో కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 27 మందితో దేవాదాయశాఖ కమిషనర్కు కమిటీలో చోటు కల్పించాలని కోరుతూ సిఫార్సు చేశారు.
కానీ పట్టించుకోకపోవడంపై కూటమిలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. ఈ నేపథ్యంలో జాతరకు ఒకవైపు చాటింపు చేసి, ఉత్సవాల్సి ప్రారంభించిన నేపథ్యంలో, మరోవైపు పాత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీని వేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ కమిటీపై తిరుపతి ప్రజానీకం సెటైర్లను చూస్తే, కూటమి తీరుపై ఎంత అసంతృప్తి వుందో అర్థం చేసుకోవచ్చు.
బైరాగి వేషానికి ఒక కమిటీ, బండ వేషానికి, తోటి వేషానికి, దొర వేషానికి, మాతంగి వేషానికి, సున్నపు కుండలు వేషానికి, గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనానికి…ఇలా రోజుకో కమిటీ వేస్తే అన్ని పార్టీల నాయకులకు న్యాయం చేసినట్టు అవుతుందని దెప్పి పొడుస్తున్నారు. ఈ దఫా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర విశేషం ఏమంటే, అమ్మవారి భక్తుల కంటే, కూటమి నాయకుల వేషాలు ఎక్కువయ్యాయి. గంగమ్మ జాతరపై కూటమి సర్కార్ ఏ మేరకు సీరియస్గా వుందో, పదేపదే ఉత్సవ కమిటీల చాటింపులే నిదర్శనం. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే విమర్శ వెల్లువెత్తుతోంది. గంగమ్మ తల్లి వీళ్ల తప్పుల్ని క్షమించి, భక్తుల్ని చల్లగా చూడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. సరిగ్గా ఉత్సవ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేని వారు ఉత్సవాలు ఎలా జరుపుతారో అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
బైరాగి, మాతంగి మా అన్న కి రిజర్వ్, ఎవడైనా ఎక్కువ మాట్లాడాడో గొడ్డలి తో సమాధానం చెప్తాం.
అవునా కట్టప్ప కత్తి ఏమి కాదు

Gangamma ku vella thapulu ksaminchadam thapaa vereee pani ledha
అక్కుపక్షి అంటే ఇలాంటోడిని చూసే పెట్టి ఉంటారు ఆపేరు.