టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే లోపల ఏమి ఉన్నా బయటకు దానిని తెలియచేయరు అని పేరుంది. మీడియాకు ఏ విధంగానూ దొరకకుండా ఆయన వైఖరి ఉంటుంది. ఆయన హుందాగానే ఇంతకాలం పాలిటిక్స్ చేస్తూ వచారు. ఇపుడు మాత్రం సోషల్ మీడియాకు ఆయన మంచి స్టఫ్ ఇస్తున్నారు అని అంటున్నారు.
గంటా ఈ మధ్యనే ఒక ప్రభుత్వ అధికారిని ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆయన అభివృద్ధి పనుల విషయమై ఆయనను గద్దించవచ్చు. కానీ వాడిన భాష బాగులేదని అంతా అన్నారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గంటాలో ఎందుకీ ఆవేశం అని అంతా అనుకున్నారు.
అదే క్రమంలో ఆ మధ్యన ఆయన విశాఖ విమానాల సేవలు వాటి తీరూ అని సెటైరికల్ గా పెట్టిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయింది. అమరావతి రాజధానికి వెళ్ళాలి అంటే తెలంగాణకు వెళ్ళాలి అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. అది టీడీపీ పెద్దలకు ఆగ్రహం కల్పించింది అని ప్రచారం సాగింది.
కట్ చేస్తే ఇపుడు చూస్తే సాటి ఎమ్మెల్యే మీద గంటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం. అది కూడా ఆయన కారులో కూర్చుంటే సదరు ఎమ్మెల్యే గారు కారు బయట నిలబడి మాట్లాడుతున్నారు. గంటా గట్టిగా మాట్లాడుతూంటే ఆయన సంజాయిషీ ఇస్తున్నట్లుగా ఉంది. నిజానికి ఎమ్మెల్యేతో ఏదైనా ఉంటే అది గంటా వేరే విధంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా బాహాటంగా ఆయనను నిలదీయడం ఏంటి అని అంటున్నారు.
ఆయన ఎవరి మీదనో కోపం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మీద చూపించారా లేక ఇద్దరి మధ్యన పొసగని విషయాలు ఉన్నాయా అని అంతా తర్కించుకుంటున్నారు. గంటా అయితే బీజేపీ ఎమ్మెల్యే విషయంలో వ్యవహరించిన సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. గంటాలో ఇటీవల కాలంలో ఆగ్రహం అసహనం బాగా పెరిపోతున్నాయని అంతా అనుకుంటున్నారు.
ఆయన గతంలోలా లేరని కూడా అంటున్నారు. గంటా సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన వారు. ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కానీ ఆయన సీనియారిటీకి తగిన విధంగా పదవులు రాలేదన్న బాధ కానీ అసంతృప్తి కానీ ఏమైనా ఉందా అన్నది పార్టీ లోపలా బయటా మాట్లాడుకుంటున్నారు.
ఆ కుళ్ళి కంపుకొడుతున్న స్టఫ్ ని ఆబగా తింటున్న GA ఎంకి!!
నీకు కోతికి కొబ్బరిచిప్పే….అటు తిప్పి ఇటు తిప్పి మూడు ఆర్టికల్స్ రాసుకున్న…పండగ చేసుకో
Are babu…niku inka update avvali ra ayya…gulte m9 ni chusi nerchukoo…evi skip cheyali.. Evi highlight cheyaloo kuda teliyadha