ఆయన మౌనం తుపాకీలా పేలుతుందా?

వ్యూహంలో భాగంగానే కేసీఆర్ మాట్లాడలేదు. ముందే బాంబులు పేలిస్తే ఇంకేముంది?

ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని గురించి బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ కొన్ని రోజులుగా బీఆర్ఎస్ సభకు సంబంధించిన వార్తలు, కథనాలు, వ్యాసాలు పేజీలకు పేజీలు పుంఖానుపుంఖాలుగా ప్రచురిస్తోంది. ఫోటోలతో నింపి పడేస్తున్నారు. రజతోత్సవ సభ అంటే చాలా పెద్ద ఈవెంట్. అందులోనూ దీన్ని నభూతో నభవిష్యతి అన్నరీతిలో జరుపుతున్నామని నాయకులు అదేపనిగా ఊదరగొడుతున్నారు.

వెయ్యికి పైగా ఎకరాల్లో సభ అంటే మాటలు కాదు. పది లక్షల మంది వస్తారని చెబుతున్నారు. ఎండలు విపరీతంగా మండిపోతున్న సమయంలో సభకు అన్ని లక్షల మంది వస్తారా? అనేది డౌటే. ఈ సభ నిర్వహణ మాత్రం పార్టీ నాయకులకు, కేడర్‌కు కత్తి మీద సామేనని చెప్పుకోవచ్చు. ఈ సభ అట్టర్ ప్లాప్ కావాలని కాంగ్రెసు, బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. అసలు ఈ సభ జరగనివ్వకూడదని రేవంత్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు. హోం శాఖ ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి సభ జరిగే ప్రాంతం పరిధిలో నెల రోజులపాటు పోలీసు యాక్టు పెట్టించాడు. సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

కాని బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఎప్పటిమాదిరిగానే ప్రభుత్వానికి చీవాట్లు వేసింది. దిగొచ్చిన ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సరే….ఈ సభ భారీగా జరిగి విజయవంతమవుతుందా? సాదాసీదాగా జరుగుతుందా? అనేది అలా ఉంచితే కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఫిరంగులు పేలుస్తారా? ఎకె‌‌ 47 తో కాల్పులు జరుపుతారా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలైతే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు పార్టీ అధినేత అయిన కేసీఆర్‌తో పత్రికలుగాని, ఛానెళ్లుగాని ఇంటర్వ్యూ చేయాలి. చేస్తాయి కూడా. కాని మీడియాకు కేటీఆరే ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

అంటే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ మాట్లాడలేదు. ముందే బాంబులు పేలిస్తే ఇంకేముంది? రేవంత్ రెడ్డికి బుల్లెట్లు దించాలంటే రేపే మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ఏం మాట్లాడతారనే కదా జనం ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠభరితంగా ఉన్నారు. అందుకే ఆ సస్పెన్స్ను అలాగే కొనసాగించారు కేసీఆర్. నిన్న కేటీఆర్ ఒక చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కేసీఆర్మాట్లాడినా సంచలనమే…మాట్లాడకపోయినా సంచలనమే’ అని అన్నాడు. గతంలో పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ‘కేసీఆర్ మౌనం గోడకు వేలాడే తుపాకీ ’ అన్నాడు.

కేసీఆర్ మౌనం కూడా ఓ వ్యూహమే అంటారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. ఎప్పుడో ఓసారి మాట్లాడేవారు. ఓసారి మాట్లాడుతూ ‘నేను కొడితే ఆ దెబ్బ మామూలుగా ఉండదు. కొడితే చాలా గట్టిగా కొడతా’ అన్నారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేసీఆర్ ఏనాడూ సుదీర్ఘంగా మాట్లాడలేదు. రేపటి బహిరంగ సభలో ఇలా మాట్లాడటానికి అవకాశం ఉంది. ప్రభుత్వంపై నిప్పులు చెరిగేందుకు అవకాశం ఉంది. హెచ్చరికలు చేసే అవకాశం ఉంది. ఆయన ఏం మాట్లాడతాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

6 Replies to “ఆయన మౌనం తుపాకీలా పేలుతుందా?”

  1. అదెందయ్య ….దేశ స్వాతంత్రం వచ్చాక కడుతున్న మొదటి నగరం పనుల ప్రారంభం వేడుకగా జరుపుకోవడం అవసరమా అని అడిగినోదివి ఇంత భారీగా రజతోత్సవ వేడుక ఈ సమయం లో అవసరమా అని అడగవా?

  2. ఓయబ్బో ఇలాంటి elevations చాలా చూసాము.. మాట్లాడినంత సేపు సక్కగా ఊగకుండా ఉండమను.. అదే పెద్ద achievement ఆడికి.. తాగుబోతు, పొగరుబోతు , వదరుబోతు , ఫామ్ హౌస్ పీనుగా 

    .

  3. ఈ సారి ఈ తాగుబోతోడు తాగి ఏమి కక్కుతాడో…లిక్కర్ రాణి కవిత ఏమి కలిపిందో .. లోడపిత్తుల కేటీఆర్ గాడు ట్రాప్ చేసి సమంత ని కూడా తీసుకొస్తాడా సభకి ?

Comments are closed.