విశాఖలో టీడీపీ కూటమి డిప్యూటీ మేయర్ పదవిని కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా కైవశం చేసుకుంది. డిప్యూటీ మేయర్ వన్ పదవి కోసం గత నెలలో నోటీసులు ఇస్తే శనివారం దాని మీద ప్రత్యేక సమావేశం జరిగింది. కూటమికి చెందిన వారే మీటింగ్ కి వచ్చి ఓటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్నారు. సక్సెస్ ఫుల్ గా వైసీపీ డిప్యూటీ మేయర్ ని దించేశారు.
అయితే డిప్యూటీ మేయర్ పదవిలో కూటమి ఎవరికి దక్కుతుంది అన్నది ఇపుడు బిగ్ డిబేట్ గా ఉంది. మేయర్ గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ పేరుని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ లెక్కన డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఇపుడు రేసులోకి తమ్ముళ్ళు దూసుకుని వస్తున్నారు. తమకూ ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. తాము ఈ పదవిని అందుకుంటామని అనేక మంది పోటీ పడుతున్నారు. పార్టీలో ఉన్న వారే కాకుండా కొత్తగా ఫిరాయించి వచ్చి చేరి వారి కన్ను కూడా ఈ కీలకమైన పదవి మీద పదవి మీద పడింది.
కూటమిలో అత్యధిక నంబర్ టీడీపీకే ఉంది అని వారు అంటున్నారు. అందువల్ల మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ని తామే చేపట్టాలని అంటున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ అని ఇంతకాలం ప్రచారంలో ఉన్న విషయం. ఇపుడు అవిశ్వాసం అవసరం తీరింది కాబట్టి జనసేనను పక్కకు జరిపి టీడీపీ తమ్ముళ్ళు ముందుకు వస్తున్నారని అంటున్నారు.
డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే కూటమిలో చిచ్చు రేగుతుంది అని అంటున్నారు. జనసేనకు ఇవ్వకుండా మేయర్, డిప్యూటీ రెండూ టీడీపీయే తీసుకుంటే రాజకీయం రంజుగా మారుతుంది. జీవీఎంసీలో తొందరలోనే ఈ రెండు పదవులకు ఎంపిక జరగనుంది. జనసేన రాజకీయ జాతకం ఎలా ఉందో అపుడు తెలుస్తుంది అని అంటున్నారు.
Vallaki endhuku ra ayya…post bokka
janasena gaaniki tikka kudurutundi Le okkaokka debba tho