కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పీఏ వాహిద్ మహిళలను ప్రలోభపెట్టి, వంచించారనే సంగతి వెలుగు చూసింది. గత అర్ధరాత్రి న్యాయం కోసం ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇంటి తలుపులు బాధిత మహిళలు తట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళల్ని మోసగించడమే కాకుండా, నిలదీసిన వాళ్లపై భౌతిక దాడి చేయించాడని వాహిద్పై మండిపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా వుండడంతో, ఏం చేసినా తనను అడిగే వాళ్లు ఉండరనే ధైర్యంతోనే మహిళలను మోసగించారనే వాదన వినిపిస్తోంది.
ఉద్యోగం, డబ్బు ఆశ చూపి ఒంటరి మహిళను కడప ఎమ్మెల్యే పీఏ పెళ్లి చేసుకున్నాడు. ఇదే రీతిలో మరో ముగ్గురు మహిళల్ని కూడా ప్రలోభపెట్టి మోసగించడం బయటపడింది. వాహిద్ వంచనపై బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని కోరిన తన కుటుంబ సభ్యులపై కడప నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్ద వాహిద్ దాడి చేసినట్టు బాధితురాలు వాపోయింది.
న్యాయం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లినా పట్టించుకునే దిక్కేలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో మాధవీరెడ్డి ఇంటికే వెళ్లి న్యాయం కోరినట్టు పలువురు బాధిత మహిళలు తెలిపారు. ఇదిలా వుండగా వాహిద్ చేతిలో గాయపడ్డ బాధితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయమై ఎమ్మెల్యే భర్త, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్రెడ్డి స్పందించారు. వాహిద్ మోసగించాడనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. తప్పు చేశాడని రుజువైతే, చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ అధికారుల్ని కోరినట్టు ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కడప లో 11 రోడ్ల కూడలి లేదా??
అక్కడ గతం లో వైఎస్సార్ పార్టీ అక్కడి నాయకుడు అతని తమ్ముడు కూడా ఇంతకంటే చాలా నేరాలు చేశాడు అన్నారు, ఆ భేవార్సు వాడికి కూడా శిక్ష వేయమని గ్రేట్ ఆంద్ర లో అడిగారా ?