దివాళా ద‌శ‌న ఉన్నా పాక్ బ‌రి తెగింపులు!

పెహ‌ల్ గావ్ ఘ‌ట‌న త‌ర్వాత ఇండియా తీసుకున్న నిర్ణ‌యాల‌తో పాక్ మ‌రింత ఇబ్బందులు ప‌డ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

డాల‌ర్ తో ఇప్పుడు పాక్ రూపాయి మార‌కం విలువ 308 గా ఉంది! భార‌త రూపాయికి అమెరిక‌న్ డాల‌ర్ మార‌కం విలువ ప్ర‌స్తుతం 86 రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటే, పాకిస్తాన్ ఒక డాల‌ర్ సంపాదించాలంటే ఏకంగా 308 రూపాయ‌లు చెల్లించాల్సిన ప‌రిస్థితుల్లో ఉంది. పాక్ లో విప‌రీత స్థాయిలో ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణానికి, పాక్ క‌రెన్సీ విలువ ప‌త‌నానికి ఇది తార్కాణంగా నిలుస్తూ ఉంది.

రెండు మూడేళ్ల కింద‌ట పాక్ తీవ్ర‌మైన క‌రువులో మ‌గ్గింది. విప‌రీత‌మైన వ‌ర‌ద‌ల‌తో.. గోధుమ పంట‌లు దుంప‌నాశ‌నం అయ్యాయి. దీంతో ఆఖ‌రికి గోధుమ‌లు దొర‌క్క పాక్ అల‌మ‌టించింది. ఎక్క‌డైనా గోధుమ‌లు క‌నిపిస్తే దొంగ‌త‌నాలు జ‌రిగాయి. ప్ర‌జ‌లు దండెత్తి గోధుమ‌ల‌ను దోచుకోవ‌డం పాక్ లో క‌నిపించింది. వాస్త‌వానికి చాలా దుర్భ‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉంది పాకిస్తాన్.

దీనికి తోడు రాజ‌కీయంగా పాక్ దుర్గ‌తిని గురించి ఎంత చెప్పుకుంటే అంత త‌క్కువ‌! ఎప్పుడు ఏ ప్ర‌భుత్వం ఉంటుందో, ఎప్పుడు ఏ పాల‌కుడు దేశం విడిచి ప‌రార్ అవుతాడో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు! ఆర్థికంగా స్థితిమంతులు ఎప్పుడో పాక్ ను దాటేస్తూ ఉన్నారు. యూర‌ప్ దేశాల‌ను, గ‌ల్ఫ్ దేశాల‌ను వారు చేరుకుంటూ ఉన్నారు. ఇక బీదాబిక్కి గ‌ల్ఫ్ దేశాల‌కు కూలి ప‌నుల కోసం వెళ్ల‌డం కూడా అక్క‌డ చాలా రొటీన్. ఇక పాక్ కు ఉన్న అప్పులు అన్నీ ఇన్నీ కావు! విదేశీ మార‌క‌ద్ర‌వ్యం విష‌యంలో పాక్ ధీన స్థితిలో ఉంది. అంతో ఇంతో చైనా అప్పులు ఇస్తూ త‌న ప్ర‌యోజ‌నాల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇండియాతో పాక్ యుద్ధం చేయాల్సి వ‌స్తే రోజుల వ్య‌వ‌ధిలో దాని ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత చితికిపోతుందన‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు!

అయినా.. పాక్ దాష్టీకాలు అయితే ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఉగ్ర‌వాదాన్ని ప్రేరేపించ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఆఖ‌రికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం క‌శ్మీర్ లో టూరిస్టుల మీద విరుచుకుప‌డ‌టం వ‌ర‌కూ వ‌చ్చింది వ్య‌వ‌హారం. ఇదంతా జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ హైజాక్ కు ప్ర‌తీకారం అన్న‌ట్టుగా పాక్ నుంచి కొన్ని స్పంద‌న‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. దాదాపు నెల‌న్న‌ర కింద‌ట పాక్ లోనే భాగ‌మైన బ‌లూచిస్తాన్ ప్రాంతంలో జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ హైజాక్ అయ్యింది.

దాదాపు నాలుగు వంద‌ల మందితో ప్ర‌యాణిస్తున్న ఆ ట్రైన్ ను బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీ అనే సంస్థ హైజాక్ చేసింది. దాన్ని విడిపించుకోవ‌డానికి పాక్ నానా తంటాలు ప‌డింది. ప్ర‌యాణికుల‌ను తాము విడిపించుకున్న‌ట్టుగా పాక్ ప్ర‌క‌టించింది. అయితే అది ఉత్తుత్తి మాట అని, ఆ ట్రైన్ లో ప్ర‌యాణిస్తున్న ఐఎస్ఐ వ్య‌క్తుల‌ను బీఎల్ఏ కాల్చిచంపిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ సంస్థ ఆ ప్ర‌చారం చేసుకుంది. మ‌రి బీఎల్ఏ ప‌నికి భార‌త్ పై ప్ర‌తీకారం ఎందుకు అంటే.. బీఎల్ఏ వెనుక ఇండియా ఉంద‌నే ఆరోప‌ణ‌ను గ‌తంలో పాక్ చేసింది.

ట్రైన్ హైజాక్ స‌మ‌యంలో పెద్ద‌గా ఈ ఆరోప‌ణ చేయ‌లేదు కానీ, పెహ‌ల్ గావ్ అటాక్ కు బీజాలు జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ వ‌ద్ద ప‌డిన‌ట్టుగా ఒక విశ్లేష‌ణ వినిపిస్తూ ఉంది. వాస్త‌వానికి పాక్ ఆగ‌డాల‌ను ఎదుర్కొన‌డానికి ఏ రోజు అయినా ఇండియా రెడీగా ఉండాల్సింది. బ‌లూచ్ ప‌రిణామాల‌తోనో, పాక్ లోని ఇత‌ర వ్య‌వ‌హారాల‌తో సంబంధం లేకుండా పాక్ ఆగ‌డాల‌ను తిప్పి కొట్టేందుకు ఇండియా స‌ర్వ‌త్రా సిద్ధంగా ఉండాల్సింది. అయితే పెహ‌ల్ గావ్ లో దారుణం చోటు చేసుకుంది.

పాక్ ఎప్పుడో ఒక ఫెయిల్డ్ నేష‌న్ గా నిలిచిన‌ట్టే. పాల‌న పరంగా కానీ, ప్ర‌గ‌తి ప‌రంగా కానీ పాక్ ఎనిమిది ద‌శాబ్దాలు కావొస్తున్నా ఏ రకంగానూ పురోగ‌తిని చాటుకోలేక‌పోయింది. ఇండియాపై ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించ‌డంలో త‌ప్ప పాక్ ఎక్క‌డా దృష్టి పెట్ట‌లేక‌పోయింది. ప్ర‌త్యేకించి గ‌త మూడు ద‌శాబ్దాల్లో.. పాక్ మ‌రింత వెనుకాబాటు త‌నం దిశ‌గా సాగుతోంది. రోజురోజుకూ అక్క‌డ పరిస్థితులు దయ‌నీయంగానే మారుతూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో కూడా పాక్ పాల‌కుల వైఖ‌రి మాత్రం ఇండియా మీద అక్క‌సు మీదే ఉండ‌టం విచార‌క‌రం!

పెహ‌ల్ గావ్ ఘ‌ట‌న త‌ర్వాత ఇండియా తీసుకున్న నిర్ణ‌యాల‌తో పాక్ మ‌రింత ఇబ్బందులు ప‌డ‌వ‌చ్చ‌ని అంటున్నారు. నీటి ఒప్పందం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. భ‌విష్య‌త్తులో పాక్ కు నీటి ఇబ్బందులు త‌ప్ప‌వు. అలాగే ఇండియా ఎగుమ‌తుల‌ను ఆపివేయ‌డం తో ప్ర‌త్యేకించి ఫార్మాసూటిక‌ల్స్ విష‌యంలో పాక్ కు గ‌ట్టి ఇబ్బంది ఎదుర‌వుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇప్పుడు ఇండియా పాక్ పై సైనిక చ‌ర్య‌ల‌ను చేప‌డితే.. ఆర్థికంగా పాక్ మ‌రింత ప‌త‌నావ‌స్థ కు చేరుకుంటుంది కూడా. ఇండియా సైనిక చ‌ర్య‌ల‌కు చేప‌డితే వాటిని ఎదుర్కొన‌డానికి పాక్ డ‌బ్బును ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది. దీంతో.. ఆర్థిక ప‌రిస్థితి అత‌లాకుత‌లం అయ్యే అవ‌కాశం ఉంది. పాక్ కు ఆదినుంచి సాయంగా ఉంటున్న ఎమిరేట్స్ దేశాలు కూడా పాక్ లో ప‌రిణామాల‌తో ఆలోచించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీపెక్ విష‌యంలో చైనా పెట్టుబ‌డులు కూడా ఇప్ప‌టికే ఆగిపోయాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా పాక్ ధోర‌ణి మాత్రం అణువంతైనా మార‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

8 Replies to “దివాళా ద‌శ‌న ఉన్నా పాక్ బ‌రి తెగింపులు!”

  1. పం*ది పెంట తినే పాకి*స్తాన్ అంటే ప్రేమ ,

    ఇండియా అంటే ద్వేషం  కలిగి

    ఇక్కడ మన మధ్యనే ఉంటూ ,

     

    ఇండియా ఎప్పుడు నాశనం చేద్దామా అని ఎదురు చూసే

    మన ఇండియ తురఖా వాళ్ళు చాలా ఉన్నారు.

  2. The debacle of pkstan is another threat to India just like బంగ్లా. So need to be very careful internally and externally. 

  3. మన సుప్రీం కోర్టు , 

    ఇండియ లో హిందూ వుల మీద పన్ను వేసి, పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేయ మంటారు ఏమో ఇప్పుడు!

    కాశ్మీర్ లో ముస్లిం ల చేతిలో ఇల్లు కోల్పోయినా కశ్మీర్ హిందువు లని ఏమో, మీరు చాలా కాలం తర్వాత వచ్చారు, ఇప్పుడు ఆ మీ హిందువుల ఇళ్లలో,

     ఆ ఇళ్లు ఆక్రమణ చేసిన  ముస్లిం లు పది మంది పెళ్ళాల పిల్లలు తో బిజీ గా ఉన్నారు . కనుక మీ ఇళ్ళు మీకు ఇవ్వడం కుదరదు అన్నీ తీర్పు ఇచిన గొప్ప సుప్రీం కోర్టు మనది.

  4. ఎడారి మతం వాళ్ళ పుస్తకం లో మాటలు తు చ తప్పకుండా పాటిస్తే, అందరూ ముస్లిం లు టెర్రరిస్టు లు అవుతారు. అవ్వాలి. కాఫిర్ ఐన హిందువుల నీ తప్పని సరిగా చంపాలి.

     ఆ పుస్తకం లో చెప్పిన విధంగా వుండని ముస్లిం ల వలనే, ఈ కాస్త ప్రశాంతత అయిన ఉంది.

    1. అందుకే అంబేద్కర్ గారు క్రైస్తవం, ఇస్లాం మతం లోకి మారలేదు.

       భారత దేశం లో నే పుట్టిన భారతీయ ధ్యాన పద్ధతి లో సాక్షాత్కారం పొందిన కాషాయ దారి బుద్ధుడి మతం లోకి మారారు.

  5. Jagan ni comment cheyadaniki adnan , pak singer ni vadukundi tdp, yellow media..ippudemo patriotism antu sollu chepthundi…

    ray tv5 Murthy, bikku bikkumane tirigi RK gaadu, sollu aapandra

Comments are closed.