తనకు ఎంతో కాలంగా అలవాటు అయిన వక్రమార్గపు రాజకీయాల తరహాలోనే.. ఏపీ రాజ్యసభ సీటుకోసం జరగబోతున్న ఎన్నికలను కూడా డీల్ చేయాలని నారా చంద్రబాబునాయుడు అనుకున్నారు. కానీ ఆ పప్పు లేమీ ఢిల్లీ కమల దళం పెద్దల వద్ద ఉడకలేదు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఆయన సారథి కావొచ్చు గాక. కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీయే సర్కారులో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి సారథి కావచ్చు గాక.. కానీ.. ఒకసారి రాజ్యసభ సీటును తమ పార్టీకి కేటాయించిన తరువాత.. అందులో మళ్లీ చంద్రబాబునాయుడు వేలు పెడితే సహించేది లేదని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు.. స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఏపీలో ఎన్నిక జరగబోతున్న ఒక్క రాజ్యసభ స్థానానికి మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. సోమవారం సాయంత్రం తమ అభ్యర్థిని ప్రకటించారు. భీమవరానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు పాక వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన వేణుంబాక విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడం వలన.. ఏపీలో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీనికి నోటిఫికేషన్ వచ్చింది. బలాబలాల ప్రకారం ఆ ఒక్క సీటు నిస్సందేహంగా కూటమికి దక్కుతుంది. అయితే.. కూటమి పార్టీల్లో దానిని ఎవరు తీసుకుంటారనే సందేహాలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. ఇప్పటిదాకా రాజ్యసభలో అస్తిత్వం లేని జనసేన అవకాశాన్ని అందుకుంటుందా? అనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయసాయిరెడ్డి బిజెపిలో చేరి, మళ్లీ తాను ఎంపీ అవుతారని ఒక ప్రచారం నడిచింది. ఆయన వాటిని ఖండించారు కూడా.
ఈలోగా ఆ ఒక్క సీటుకోసం.. తమిళనాడు బిజెపి మాజీ చీఫ్ అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లను బిజెపి పరిశీలిస్తున్నట్టు బాగా పుకార్లు వినిపించాయి. అయితే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా రాజ్యసభ సభ్యత్వానికి తీవ్రంగా ప్రయత్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని ఆయన వెళ్లి అమిత్ షాను కలిశారు. అలాగే.. సరిగ్గా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే తాను కూడా ఢిల్లీలో తిష్ట వేసి.. చంద్రబాబు సిఫారసు చేయించుకున్నారు. చంద్రబాబుకు ఎంతో సన్నిహిత నాయకుడు అయిన మందకృష్ణ ను ఎంపీ చేస్తే.. బిజెపిలో తన మనిషిగానే ఉంటాడని చంద్రబాబు కూడా భావించినట్టు ప్రచారంలోకి వచ్చింది.
తీరా.. నామినేషన్లకు గడువు దగ్గర పడిన సమయానికి అనూహ్యంగా బిజెపి పాక వెంకట సత్యనారాయణ పేరును ప్రకటించింది. ఆయన గతంలో భీమవరం కౌన్సిలరుగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు సిఫారసును బిజెపి పెద్దలు బుట్ట దాఖలు చేసినట్టు అయింది.
CBN గారి లాంటి రాజనీతిజ్ఞుడు ని వక్ర రాజకీయం అన్నావంటే నువ్వు వెధవి కాదు వెధవన్నర వెధవ్వి అని అర్థం రా బోకు ఎంకి!! నీది, నీ మాడా రెడ్డి గాడి ది అందరికన్నా అష్టవంకర బుద్ధి!! మాడా రెడ్డి గాడి కోట్లు ఆస్తి సీబీఐ/ ED జప్తు చేసింది, వాడికి ఎక్కడిది ఆ డబ్బు, అలాంటి క్రిమినల్ bas**** ని సమర్ధిస్తున్న నువ్వు ఈ రోజు నుండి కుక్క తో సమానం రా ఎంకి!!
హి హి హి ..
కెమెరామన్ గంగతో రాంబాబు లో బ్రహ్మానందం లాగా తయారయ్యావు రా వెంకట్ రెడ్డి..
మందకృష్ణ మాదిగ కి రాజ్యసభ ఇచ్చేసారు అని రాసిందీ నువ్వే.. దానికి “చంద్రబాబు మనిషి” అని ఏడుస్తూ ఆర్టికల్స్ గుప్పించింది నువ్వే..
ఇప్పుడు ఆ ఎంపీ సీట్ మరెవరికో ఇచ్చేసరికి.. చంద్రబాబు పప్పులేమీ ఉడకలేదు అని పులుపెక్కిపోతున్నదీ నువ్వే..
అటైతే అటు.. ఇటైతే ఇటు.. ఆర్టికల్స్ రాసి పెట్టుకుని.. ముందు రాసినదానికి.. తర్వాత రాస్తున్నదానికి సంబంధం లేకుండా.. (అంటే సిగ్గు లేకుండా) అబద్ధాలు వండేసేదీ నువ్వే..
ఛీ.. దీనెమ్మాబతుకు..
Chee Ni Bathuku anali vadini
Nuvvu Choosava sodara,
Gurava Reddy article rasi Gurava Reddy Atlanta ani pettukuntadu.
Atlanta ki puttada ? Atlanta lo puttada?
leka Atlanta ane degree chadivada?
ఇప్పుడు విశేషం ఏమిటంటే పాక వెంకట సత్యనారాయణ గారు సాక్షి గూటి పక్షి.(మరో జివిఎల్ )
నీలాంటి వాళ్ళను చూసే శీను వైట్ల బాద్షా సినిమాలో పద్భాంఆభా సింహ క్యారెక్టర్ రాసాడు…నీ ఊహాలోకంలో నువ్వు ఏదో అనుకోని….అది జరగలేదని ఇంకెవరిమీదో ఏడుపు
Bollodu vache seat Madigollakisthada,?just drama
lol. manda krishna ni chandrababu recommend chesada. adi vaadanna nammado ledo. Kootami lo nothing is free. Manda babu oka 100 crores funding tho ready vunte emo cheppalem kaani. otherwise no recommendation.