వినాశనం జరిగితే తప్ప స్పందించరా సార్!

బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ఏ రీతిగా అతలాకుతలం చేసిందో.. జనజీవనాన్ని ప్రమాదంలోకి నెట్టిందో.. ప్రాణాలను బలిగొన్నదో, ఆస్తినష్టాన్ని కలగజేసిందో అందరూ చూశాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగానే చేశారు. అంతకంటే…

బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ఏ రీతిగా అతలాకుతలం చేసిందో.. జనజీవనాన్ని ప్రమాదంలోకి నెట్టిందో.. ప్రాణాలను బలిగొన్నదో, ఆస్తినష్టాన్ని కలగజేసిందో అందరూ చూశాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగానే చేశారు. అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు అండ్ కో ఫోకస్ మొత్తం.. జగన్ ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే బుడమేరు పొంగిందని ఆరోపించడం మీదనే సాగిపోయింది.

జగన్ మీద కొన్ని వందల సార్లు నిందలు వేస్తూ గడిపారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మంత్రి నారాయణ మీడియా ముందుకు వచ్చి భవిష్యత్తులో ఇలాంటి పెను ప్రమాదం మరోసారి జరగకుండా చూసేందుకు ఏం చేయగలమో తమ ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తున్నారు.

తెలంగాణలో కాలువలు, చెరువులపై నిర్మించిన ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు కూడా చేపట్టబోతున్నట్టుగా మంత్రి నారాయణ చెబుతున్నారు. బుడమేరు పరిధిలో ఆక్రమణల్ని తొలగించడం మాత్రమే కాదు. అదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాల్వల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామని కూడా నారాయణ అంటున్నారు. నెల్లూరులో ప్రధాన కాల్వలను పరిశీలించిన ఆయన భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాలువలు ఆక్రమించి కట్టిన నిర్మణాలు అన్నింటినీ తొలగించేందుకు సర్వే చేయిస్తున్నామని అంటున్నారు.

నిజానికి బుడమేరు అనుభవం తర్వాత కూడా, హైడ్రా కూల్చివేతలు ఎంత చురుగ్గా సాగుతున్నాయో గమనిస్తున్న తర్వాత కూడా.. ఏపీ ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడం జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఈసరికే స్పష్టమైన, వివాదం లేని ఆక్రమణల కూల్చివేతలు ఏపీలో కూడా మొదలై ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ప్రజలకు కాస్త నమ్మకం కలిగేది.

ఈ ప్రభుత్వం ఇంకా మాటల దశలోనే ఉంది. రానున్నది వర్షాకాలం అని, అనూహ్యమైన ప్రమాదాల రాగలవని గుర్తించకుండా ఉంది. ఇంకా సూటిగా చెప్పాలంటే.. కృష్ణ నది గట్టును ఆక్రమించి కట్టిన లింగమనేని హౌస్ లో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారు. విజయవాడ నగరాన్ని సురక్షితంగా ఉంచాలంటే.. ఆ భవంతిని కూడా కూలిస్తే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు చేపట్టినట్టు కాదు. లింగమనేని హౌస్ విషయంలో ఒక నీతిని, కాలువలు, చెరువులు ఆక్రమించిన పేదల ఇళ్ల విషయంలో మరొక నీతిని వారు పాటించకుండా ఉండాలి.

కృష్ణ నది విషయంలో కూడా బుడమేరు కలిగించిన వినాశనం కంటె మించిన మరో విపత్తు జరిగితే తప్ప.. తాము స్పందించబోం అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వ తీరు కనిపిస్తోంది. హైడ్రా తరహాలో చర్యలు తీసుకుంటాం అని నాటకీయంగా ప్రకటిస్తూ.. మొక్కుబడి చర్యలు తీసుకున్నంత వరకు ప్రయోజనం ఉండదని ప్రజలు అంటున్నారు.

7 Replies to “వినాశనం జరిగితే తప్ప స్పందించరా సార్!”

  1. “వినాశనం జరిగితే తప్ప స్పందించరా సార్!”….article is reminding that Jagan will not even respond after atrocious,painful events..so at least this govt is responding after event..

    is that what you want to convey..lol

  2. పోట్టి బుడంకాయ్ ప్యాలస్ పులకేశి గాడు ఇప్పుడు బెంగళూర్ లోనే తొంగున్నాడ ?

    తనకి ఎంఎల్ఏ ఓట్లు వేసి గెలిపించిన జనాలకి సవతి. మగాడు కి వదిలేసి.

  3. Ori half knowledge fellow, edina oka policy ready cheyali ante govt ki time kavali. kasta aagu…enduku inka next time 11 kuda rakunda plan chestunnattu vunnav nuvvu.

Comments are closed.