బాబు స‌ర్కార్‌ను క‌డిగిపారేసిన అమ‌రావ‌తి ఉద్య‌మ నాయ‌కురాలు

అంత‌కు ముందు తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు దిక్కులేదు. మ‌ళ్లీ ఇప్పుడు 40 వేల ఎకరాలు చంద్ర‌బాబు స‌ర్కార్ తీసుకుంటుంద‌ట‌.

సుంక‌ర ప‌ద్మ‌శ్రీ‌… అమ‌రావ‌తి ఉద్య‌మ మ‌హిళా నేత‌. రాజ‌కీయంగా ఆమె కాంగ్రెస్ వాది. వైసీపీ హ‌యాంలో మూడు రాజ‌ధానుల అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడు, రైతుల త‌ర‌పున గ‌ళమెత్తిన నాయ‌క‌రాలు. రాజ‌కీయాల కంటే రైతులు, ప్రాంత ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని నిరూపించారామె. అయితే అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ న‌య వంచ‌న‌ను ఆమె, గ‌తంలో కంటే రెట్టింపు స్థాయిలో నిర‌సిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌ని, అందుకోసం ఎందాకైనా అని అవిశ్రాంత పోరాటం చేసిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీతో పాటు మ‌రికొంద‌రు నేత‌ల్ని చంద్ర‌బాబు స‌ర్కార్ గృహ నిర్బంధం చేసిందంటే, పాల‌కులు ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఆమె ప్రశ్నించే గొంతుక‌ను మాత్ర‌మే ఈ ప్ర‌భుత్వం నిల‌వ‌రించ‌లేక‌పోయింది.

తాజాగా తూటాల్లాంటి ఆమె ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ స‌మాధానం చెప్పి తీరాలి. అమ‌రావ‌తి రైతాంగం మ‌నోభావాల్ని ఆమె ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి. మీడియాతో సుంక‌ర ప‌ద్మశ్రీ ఏమ‌న్నారో… ఆమె మాట‌ల్లోనే తెలుసుకుందాం.

“అంత‌కు ముందు తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు దిక్కులేదు. మ‌ళ్లీ ఇప్పుడు 40 వేల ఎకరాలు చంద్ర‌బాబు స‌ర్కార్ తీసుకుంటుంద‌ట‌. మంత్రి నారాయ‌ణ ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కాదు. రైతులంతా దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిపై మీరెందుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేదు? ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు నుంచి అమ‌రావ‌తికి భూములిచ్చిన రైతులు రాజ‌ధానిపై చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేస్తామ‌నే ప్ర‌క‌ట‌న‌ను ఆశించారు. కానీ నిరాశ మిగిల్చారు.

క‌లియుగ దైవం శ్రీ‌వారి పాదాల సాక్షిగా 2014లో మోదీ ఇచ్చిన హామీలే ఇంత వ‌ర‌కూ నెర‌వేర‌లేదు. కూట‌మి అధికారంలోకి రావ‌డానికి టీడీపీ కార‌ణం. మ‌రెందుకు ప్ర‌ధాని మోదీని చంద్ర‌బాబునాయుడు బ‌తిమ‌లాడుతున్నారు? డిమాండ్ చేసే ప‌రిస్థితిలో ఉన్నాం. ఒక‌ప్పుడు పాచిపోయిన ల‌డ్డూ ఇచ్చార‌ని విమ‌ర్శించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఇప్పుడు అదే మోదీని దేవునితో పోల్చారు. ప‌వ‌న్‌కు చాక్లెట్ ఇవ్వ‌డం చూసి ప్ర‌జ‌లంతా న‌వ్వుకుంటున్నారు. 1500 కోట్లు ఖ‌ర్చు పెట్టి భారీ ఎత్తున స‌భ పెట్టింది ప‌ర‌స్ప‌రం పొగుడుకోడానికా? సిగ్గ‌నిపించ‌డం లేదా?

అప్పుడు రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టి తాత్కాలిక భ‌వ‌నాలు, ఇప్పుడేమో రూ.1500 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఢిల్లీని త‌ల‌ద‌న్నే రాజ‌ధాని అయిపోయింది. సింగ‌పూర్ పోయింది. కొత్త‌గా జపాన్ లాంటి రాజ‌ధాని క‌డ్తామ‌ని చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు. మ‌ళ్లీమ‌ళ్లీ శంకుస్థాప‌నలా? సిగ్గ‌నిపించ‌లేదా? మూడోసారి ప్ర‌ధాని అయిన మోదీ, రాష్ట్రానికి వ‌చ్చి మోసం చేస్తారా? ఇంట్లో నుంచి బ‌య‌టికి రాకుండా గృహ నిర్బంధం చేస్తే, మాట్లాడ‌కుండా వుంటామ‌ని అనుకోవ‌ద్దు.

జ‌గ‌న్‌ను విధ్వంస‌కారుడిగా, దోపిడీదారుడిగా విమ‌ర్శించినోళ్లే, నేడు ప‌ది రెట్లు సంపాదించుకోవాల‌న్న ఆలోచ‌న‌తో రాష్ట్రంలో ఉన్న రెండు ల‌క్ష‌ల ఎక‌రాల భూముల్ని కార్పొరేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నారు. కేశినేని చిన్నిలాంటి వాళ్ల‌ను బినామీలుగా పెట్టుకుని దోచుకోవాల‌ని చూసినా స‌రే, ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నిస్తాం. త‌ప్పుడు హామీల‌తో, అబ‌ద్ధాల‌తో అధికారంలోకి వ‌చ్చారు. అదే ప్ర‌జ‌లు బుద్ధి చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత త్వ‌ర‌గా, అది కూడా ఏడాది లోపే ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. చంద్ర‌బాబును సీఎం అన‌డం కంటే, ఈవెంట్ మేనేజ‌ర్ అన‌డం స‌రైంది. ఎందుకంటే, మేనేజ్ చేయ‌డంలో ఆయ‌న దిట్ట” అని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఇంత త్వ‌ర‌గా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోలేద‌నే ప‌ద్మ‌శ్రీ విమ‌ర్శ‌ల్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే అమ‌రావ‌తిపై చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేద‌న్న కోపం రైతుల్లో వుంద‌ని చెప్ప‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకోవాలి. గ‌తంలో ఏ ప్ర‌జ‌లైతే కూట‌మిని గ‌ద్దెనెక్కించారో, ఇప్పుడు అదే ప్ర‌జ‌లు ఓడిస్తార‌ని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ విమ‌ర్శ‌లు కూట‌మికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

31 Replies to “బాబు స‌ర్కార్‌ను క‌డిగిపారేసిన అమ‌రావ‌తి ఉద్య‌మ నాయ‌కురాలు”

  1. Haha now she became amaravathi udyama nayakuraalu? If any one loves amaravathi they should support CBN, if jagan have won amaravathi would have a history.

  2. Nice points. Amaravati is a real estate and ATM for alliance leaders but a centument for these farmers. I am opposed to spending lakhs of crores in the name of a capital but they can have the government buildings, airport and basic infrastructure needed for a capital created and let the remaining city grow organically. This is nothing but plan to loot public money and assets.

      1. Except disliking caserla can’t do much , ofcourse false and baseless allegations are trademarks though. Comeon vent out the frustration, already you feeling uneasy as no ENO supply

  3. గతం లో ఈవిడ జగన్ రెడ్డి ని విమర్శించినప్పుడు.. మనం ఈవిడకి పచ్చ రంగు పులిమేశాం..

    ఇప్పుడు చంద్రబాబు ని విమర్శించేసరికి అమరావతి ఉద్యమ నాయకురాలు అయిపోయింది..

    నీలి మీడియా లో ప్రమోషన్ సంపాదించేసింది .. రేపో మాపో సాక్షి టీవీ లో డిబేట్స్ చేసుకుని చిల్లర పట్టుకెళ్లిపోతుంది..

    1. రేపు మళ్ళా  బాబు ను పొగిడితే చాలు బాబు కోవర్ట్ అంటారు..

  4. అమరావతి ఒక గూడుపుఠానీ. నరం లేని నాయకుడి మాయాజాలం. భూమిపుత్రుల ఘర్మజల దోపిడీ ముఠా కరాళనృత్యం. ఇది సత్యం.

    1. అందుకే ఆ భూమి పుత్రుల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోయారు…ఆ భూమి పుత్రుల కి భయపడి ఒకడు అయిదు ఏళ్ళ పరదాలు కట్టుకు తిరిగాడు…ఇంతకీ అమరావతిలో ఉన్నది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అయితే భూమి పుత్రులు యాడా?

    2. ///భూమిపుత్రుల ఘర్మజల దోపిడీ///

      .

      హ! హ!! అక్కడ ఎ భూమిపుత్రుడిని అడిగినా చెపుతాడు…

      నరం లేని నాయకుడు ఎవరొ?

      ఎ ముఠాలు కరాళనృత్యం చెసాయొ??

  5. అమ్మే ఇప్పుడు ఏట్ట? బాబు ప్రభుత్వం ఈ రాత్రి యెట్టరా గడిచేది అని దడ దడలాడుతుంది….పొద్దున్నే సూర్యారావు వస్తె కానీ ఆరేలా లేదు కడిగింది

  6. అమె అమరావతి కొసం ఉద్యమంలొ పల్గొన్నప్పుడు నువ్వు ఎపూడూ రాసినట్టు లెదు! ఇప్పుడు ఎకంగా అమె ఉద్యమ నాయకురాలు అయ్యిందా?

    .

    అక్కడ రైతులు భూములు ఇస్తా అంటున్నారు. ఫ్రభుత్వానికి కూడా ఐర్పొర్ట్ కొసం స్తలం కావాలి. ఐర్పొర్ట్ స్తలం ఇస్తె బొగాపురంలొలా ప్రవేటు వ్యక్తులె పెట్తుబడులతొనె కట్టెస్తారు!

    .

    ఎవ్వరికీ ఎ నొప్పి లెదు! మద్యల్లొ బులుగు మీడియాకి, నాయకులకె నొప్పి!

  7. వాళ్ళు ఏమీ చలించరు వ్రృథా కంఠశోష.ఏపార్టీ పదవిలో వున్న ప్రజలకి ఏమీఒరగదు.వాళ్ళవాళ్ళుకార్యకర్తలు ఆతరువాత ప్రజలు ఇది గత 70ఏళ్ళుగా జరుగుతున్న చరిత్రే.

    1. Neeku Jagan dialogue  chevullo  baaga motha moguthunnatlu ga undi. తప్పు chesinollanu oodatheeestha అన్నాడు. Nuvvu bhayapadamaka.

  8. ఆమెకు తోచింది ఆమె చెప్పింది ఇక్కడ వాక్స్వాతంత్ర్యాన్ని గౌరవించారు కానీ వైసీపీ పాలనలో రోడ్ మీదకు వస్తే లోపలేసేయ్యడమే కదా

  9. Ivanni enduku GA….

    Annaya stand ento rambabu tho cheppinchu…

    Botsa emo 3 capital kadu antadu…

    Party stand enti???

    Amaravathi or 3 capitals???

    1. బ్రో , ఎర్రి గొర్రెలు అన్ని జగన్ గాడి దగ్గరే ఉండడం వాడి అదృష్టం.

      2019 లో వై సీపీ అమరావతీ యే క్యాపిటల్ అన్నారు, 3 రాజధానుల గురించి ఎన్నికల ముందు చెప్పలేదు.

      2024 లో మూడు రాజధానులు అన్నాడు

      కర్నూల్, వైజాగ్ , గుంటూరు మూడు చోట్ల ఓడిపోయారు కూడా .

      కనీసం బుర్ర లేకుండా ఎలా రా చెప్పిస్తాడు .

  10. అమరావతి ఉద్యమం బహుజన నాయకుడు బాల కోటయ్య కి శంకుస్థాపన ఆహ్వానం ఎందుకు లేదో వాడికి ఇంకా అర్థం కాలేదు, ఇంకా abn లో కుర్చుంటున్నాడు

  11. ” ఒక్క అవకాశం ” అని అడిగితే ,ఏదో చేసేస్తాడు అని ఇచ్చారు. ఆ చేసింది చూసి తట్టుకోలేక ప్రజలు పదకొండు ఇచ్చి ఇదే ఎక్కువ అంటున్నారు.

Comments are closed.