అక్క‌డ‌ వైసీపీకి నిద్రా భంగం చేయొద్దు!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌కుండా, ఇళ్ల‌లోనే కూచుని, ఎన్నిక‌ల‌ప్పుడు వెళితే ఓట్లు వేస్తారా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో నిద్ర‌పోతున్న వైఎస్సార్‌సీపీని ఎవ‌రూ నిద్ర లేపొద్దు అనే సెటైర్స్ సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 40 శాతం ఓటు బ్యాంక్ క‌లిగి, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం త‌ర‌పున ప్రాతినిథ్యం క‌లిగిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్ర‌మే. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల్సిన ఆ పార్టీ, పేద‌ల గూళ్లను కూల‌గొడితే క‌నీస స్పంద‌న కూడా క‌రువైంది.

ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో 800 మంది పేద‌ల ఇళ్లు, అలాగే 200 దుకాణాల్ని వివిధ కార‌ణాల‌తో కూల్చివేశారు. వీళ్లంతా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అందులోనే జీవ‌నం సాగించే పేద ప్ర‌జ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. బాధితుల‌కు సీపీఎం అండ‌గా నిలిచింది. ఇక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తూ, డిప్యూటీ స్పీక‌ర్ హోదాలో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రిపై సీపీఎం నాయ‌కులు, అలాగే పేద‌లు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓట్లు వేసి, గెలిపించుకున్నందుకు రిట‌ర్న్ గిఫ్ట్‌గా రోడ్డున ప‌డేశార‌ని, త‌మ ఉసురు ఊరికే పోద‌ని బాధిత మ‌హిళ‌లు ర‌ఘురామ‌కు శాప‌నార్థాలు పెట్టారు.

మ‌రోవైపు త‌న‌ను త‌ప్పు ప‌ట్టిన సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస్‌పై ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న‌దైన స్టైల్‌లో నోరు పారేసుకున్నారు. ర‌ఘురామ మాట్లాడిన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌శ్నించిన సీపీఎం నేత‌ల్ని ర‌ఘురామ క‌నీస స‌భ్య‌త‌, సంస్కారం లేకుండా దూషించ‌డం ఏంట‌నే నిల‌దీత పౌర స‌మాజం నుంచి ఎదుర‌వుతోంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్‌సీపీ పాత్ర‌పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు ఉన్నారు. అలాగే జిల్లా అధ్య‌క్షుడిగా ప్ర‌సాద్‌రాజు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల గూళ్లు చెదిరి, ఆవేద‌న‌తో రోడ్డెక్కి ఆక్రంద‌న‌లు చేస్తున్నా వైఎస్సార్‌సీపీ మ‌న‌సు చ‌లించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా వుంద‌నే మాట వినిపిస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ ధీమాగా చెబుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌కుండా, ఇళ్ల‌లోనే కూచుని, ఎన్నిక‌ల‌ప్పుడు వెళితే ఓట్లు వేస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఇప్ప‌టికైనా ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితుల ప‌క్షాన సీపీఎంతో పాటు పోరాడాల్సిన బాధ్య‌త వైఎస్సార్‌సీపీపై వుంది. కుంభ‌క‌ర్ణ నిద్ర‌లో వుంటామ‌ని వైఎస్సార్‌సీపీ నేత‌లు త‌మ చ‌ర్య‌లు ద్వారా సంకేతాలు పంపితే చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు.

8 Replies to “అక్క‌డ‌ వైసీపీకి నిద్రా భంగం చేయొద్దు!”

  1. అప్పట్లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉన్నారు అని ఒక ఊరు లో ఇళ్ళు మొత్తం కూలగొట్టి నా సంగతి , గుర్తు వుందా గురివింద గింజ గ్రేట్ ఆంద్ర? 

    అప్పుడు ప్యాలెస్ పులకేశి గాడు నీది చీకుతా ఉన్నాడా, తేనె వేసుకుని ? 

  2. అసెంబ్లికి వెళ్ళనప్పుడు స్పందిస్తే ఏం లాభం అనుకొని ఉంటారు

  3. హాయిగా 5 ఏళ్ళు కళ్ళుమూసుకుని నిద్రపోతే, అధికారం ప్యాలెస్  గేట్ తన్నుకుంటూ అదే వస్తుందని మా లెవెనన్న చెప్పాడు అందుకే మేము ఎదురుచూస్తు ఉన్నాం 

  4. తమరి అన్న హయాంలో ఎటువంటి కోకలలో జరిగాయి లేరా గ్యాస్ ఆంధ్ర. మరి అప్పుడు లెగని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది ? తప్పు ఎవరి చేసిన తప్పే ఒకరి చేస్తే తప్పు కానప్పుడు ఇంకోరు చేస్తే ఒప్పు  ఎలా అవుతుంది రా గాడిద . మీ అన్న హయాంలో ఇల్లు కూలగొట్టడాలు గోడ కట్టడాలు రోడ్డు పీకడాలు నీళ్లు పీకరాలు ఒకటా రెండా ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు  . అప్పుడు నువ్వు చోద్యం చూస్తున్నావు అంతే .

     ఇది తప్పు అని చెప్పడానికి నోరు రాలేదు ఇప్పుడు మాత్రం నోరు లెగుస్తుంది . అందుకే నీ రాతలకు ఎవడు viluva  ఇవ్వడం లేదు . వీడెప్పుడూ వైసిపి సంక నాకుతూ ఉంటాడు కాబట్టి వాని వార్తలన్నీ సంక నాకుతుంటాయని ఎవడు నీ వార్తలకు వెళ్లి ఇవ్వడం లేదురా అడ్డ గాడిద .

Comments are closed.