ఉక్కు ప్యాకేజి సొమ్ము బ్యాంకులకే!

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయరాదు అని కోరుతూ ఉక్కు కార్మిక లోకం చేపట్టిన నిరసనలు ఇప్పటికి 1500 రోజుల మైలు రాయిని దాటాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భారీ ఆర్థిక ప్యాకేజిని ప్రకటించామని కేంద్రం తరచూ చెబుతూ వస్తోంది. అయితే ఈ ప్యాకేజి వల్ల ఒనగూడినది ఏదీ లేదని ఉక్కు కార్మిక సంఘాలు మొదటి నుంచి అంటూనే ఉన్నాయి. ఉక్కు కర్మాగారానికి ఈ మధ్యన కేంద్రం ప్రకటించిన 11 వేల కోట్ల రూపాయల ప్యాకేజిని బ్యాంకులు తమ బకాయిలుగా జమ చేసుకున్నారని ఉక్కు పోరాట కమిటీ నాయకులు చెప్పారు.

అందువల్ల ఆర్థిక ప్యాకేజి వల్ల ఉక్కుకి ఏమీ దక్కలేదని వారు అన్నారు. విశాఖ ఉక్కుని కాపాడాలంటే కనుక ప్రైవేటీకరించమని స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సొంత గనులు కేటాయించాలని కోరారు. విశాఖ కర్మాగారాన్ని పూర్తి సామర్ధ్యంతో నడపాలని కోరారు.

ఇప్పటికే 1200కి పైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, మరో నాలుగు వేల మంది దాకా కార్మికులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వైఖరి వల్ల ఉక్కు ప్రైవేట్ పరం అవుతుందని అంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు.

విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం చిత్తశుద్ధిగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయరాదు అని కోరుతూ ఉక్కు కార్మిక లోకం చేపట్టిన నిరసనలు ఇప్పటికి 1500 రోజుల మైలు రాయిని దాటాయి. రానున్న రోజులలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పోరాట కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

8 Replies to “ఉక్కు ప్యాకేజి సొమ్ము బ్యాంకులకే!”

  1. షేమ్ షేమ్ రవి గారు! మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు!

    మీరు జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తే మీ ఇష్టం. కానీ మరొకరి మరణాన్ని కోరేంత నీచమైన స్థాయికి మీరు దిగజారడం నిజంగా శర్మించాల్సిన విషయం! చదువుకున్న, విదేశాల్లో ఉన్నవారు ఇలా వాగితే, మిగతావారు ఎలా ఉండాలి? మీ మతం, మీ నైతికత, మీ మనుష్యత అన్నీ పోయాయా?

    ఈ రాజకీయ ద్వేషం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తోంది. మీరు తెలుసుకోవాలసిన ఒక నిజం ఏమిటంటే, రాజకీయ నాయకులు మీ కోసం ఎప్పటికీ రారు! కానీ ఈ విషం మీ శరీరాన్ని, మనసును కుళ్ళబెడుతుంది. మీరు మీ శత్రువు మీరే అవుతున్నారు.

    మీ మానసిక పరిస్థితి ఏ స్థాయికి చేరిందో ఒకసారి ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని చెక్ చేయండి! ఇప్పటికే ప్రభావం చూపి ఉండొచ్చు! మీరు ఇలాగే కొనసాగితే, త్వరలోనే మీరు మీ కుటుంబానికి భారంగా మారిపోతారు. ఇప్పటికైనా మేల్కొని ఆపండి!

    రాజకీయ భక్తి ఒకటి, కానీ మనుష్యత కోల్పోవడం అసహ్యం! మీరు ఇంకా కొంచెం అయినా బుద్ధి, గౌరవం కలిగినవారు అయితే, ఈ ద్వేషాన్ని ఆపేయండి. లేదా, మీ క్షీణతకు మీరే బాధ్యత వహించాలి!

  2. Privatization creates more opportunities and efficiency in the system. Almost 30 to 40% of state budget goes to government employees.

    In Ap, Govt. is spending Rs. 90,000/kid/year. I studied in Govt. schools. They teach nothing.

    Govt should privatise steel plant to clear off its own debt.It creates more opportunities to so many young private employees.

Comments are closed.