ఒంగోలు టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగి దాదాపు మూడు వారాలవుతోంది. ఇంత వరకూ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు సన్నిహితంగా మెలిగే వీరయ్య హత్య చౌదరిని చంపితేనే, ఇంత వరకూ దిక్కులేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వీరయ్య చౌదరికి టీడీపీకి ఎంతటి వీరాభిమానో చెప్పే వాళ్లే తప్ప, ఆయన్ను భౌతికంగా అంతమొందించిన నిందితుల అంతు చూడడంలో నాన్చివేత ధోరణి కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వీళ్లే సూత్రధారులు, వాళ్లే పాత్రధారులంటూ ప్రభుత్వ అనుకూల మీడియా రోజుకో రకమైన కథనాన్ని జిల్లా పేజీల్లో వండి వారుస్తున్నాయి. పలు రకాల అనుమానితుల గురించి తమదైన రీతిలో వండివార్చారు.
కానీ వాళ్లెవరినీ ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. అసలు వీరయ్య చౌదరి హత్య కేసులో ఇంత వరకూ విచారణలో పురోగతి ఏంటో సంబంధిత అధికారులు చెప్పకపోవడం గమనార్హం. ఇదిగో ఈ రోజు, రేపు అంటూ విచారణాధికారులు చెప్పడమే తప్ప, అసలు హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి? ఎవరు చేయించారనే వివరాలు వెల్లడి కాలేదు.
హత్య వివరాలను బయట పెడితే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. ల్యాండ్, శ్యాండ్, లిక్కర్ మాఫియాల్లో వీరయ్య చౌదరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ వుంది. అందుకే వీరయ్య చౌదరి హత్య కేసు విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోందన్న చర్చ కూడా లేకపోలేదు. ఏది ఏమైనా టీడీపీ అధికారంలో వుండగా, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు హత్యకు గురి కావడం, నిందితుల్ని ఇంత వరకూ పట్టుకోకపోవడం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకే మచ్చ అని కూటమి నేతలు అంటున్నారు.
సర్లే …మొన్న జరిగిన ఘటన మీద బాగానే అడిగావ్ కానీ….సొంత బాబాయ్ హత్య జరిగి ఏడేళ్ళు అయింది…అధికారం 5 ఏళ్ళు వెలగబెట్టం….ఏమీ పీకారు…అని ఒక్క రోజన్న అడిగావా?
మరి మా డా అన్నియ్య సొంత బాబాయ్ హత్య కేసు లో ఏం పీకాడు 5 ఏళ్ళు? పీకితే అవినా”బావ” సంబంధాలు బయటకి వస్తాయేమో , తనకి కూడా బాత్ రూం లో గొడ్డలి పోటు తెప్పిస్తారేమో అని భయం తో పీక లేదా?
Emi GA Venkat,
champindi tdp pandule ..Anduke sound ledu ..
visayam local people knows very well..just case file cheyadaniki jankutunnaru
అయితే.. బాబాయ్ ని చంపింది అడివి పందులన్నమాట ..ఏడేళ్లుగా సౌండ్ లేదు..
విషయం లోకల్ జనాలకు తెలుసు కదా.. అక్కడ కూడా సౌండ్ లేదు మరి..
అంటే వాళ్ళు వాళ్ళు దొంగ నా కొడుకులు అంటావ్…
అందుకేగా.. మా జగన్ రెడ్డన్న బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అక్కరలేదు అని తేల్చి చెప్పేసాడు..
అంటే వాళ్ళు వాళ్ళు దొంగ నా కొడుకులు అంటావ్…
పిల్లనిచ్చిన మామ, సొంత బాబాయ్ చచ్చిపోతేనే దిక్కులేదు. వాడెవడో చస్తే పట్టించుకుంటామా? పొలిటికల్ మైలేజ్ వస్తేనే చావైనా , పెళ్ళైనా.
As usual publicity hungama, blame opposition and finally water down case.