పల్నాడు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టీడీపీ నాయకుడు కోడెల శివరామ్ ఆగ్రహం చల్లారకనే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అధిష్టానంపై ఫైర్ కావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీ ఇన్చార్జ్ ఉండగానే, వారికి పోటీగా మరొక నాయకుడిని లోకేశ్ ప్రోత్సహిస్తుండడం సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో గత కొంత కాలంగా భాష్యం ప్రవీణ్ తనకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని కూడగట్టడాన్ని పుల్లారావు జీర్ణించుకోలేకపోతున్నారు.
భాష్యం ప్రవీణ్తో పాటు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడంపై అధిష్టానానికి కూడా ఆయన చురకలు అంటించడం గమనార్హం. భాష్యం ప్రవీణ్ లాంటి నేతలకు టికెట్ ఇస్తే ఎలా అని ఆయన పరోక్షంగా చంద్రబాబును నిలదీశారు. ఇటీవల భాష్యం ప్రవీణ్ వివిధ అవసరాల కోసం రెండు దఫాలుగా కోటి రూపాయలు విరాళం ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని పుల్లారావు దెప్పి పొడిచారు.
ప్రవీణ్కు అసలు చిలకలూరిపేటలో ఓటే లేదని ఆయన గుర్తు చేయడం గమనార్హం. చిలకలూరిపేటలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్పారంటే, ఎంతగా డిస్ట్రబ్ అయ్యారో అర్థమవుతోందనే చర్చకు తెరలేచింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు