కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు దఫాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. గత నెలాఖరులో మూడో దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ, అది నెరవేరలేదు. ఈ నెలాఖరుకు భర్తీ చేస్తామని రెండు రోజుల క్రితం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
మార్కెట్యార్డ్ చైర్మన్లు, తిరుపతి, విజయవాడ, విశాఖ తదితర అభివృద్ధి అథారిటీల చైర్మన్లను నియమించాల్సి వుంది. కొన్నేళ్లుగా రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే… ప్రతిదీ వేలం పాటే. ఉద్యోగులకు సంబంధించి పోస్టును బట్టి రేటు కడ్తున్నారు. రాజకీయంగా నామినేటెడ్ పదవులకు ఆదాయం ఉన్న వాటికి ఓ రేటు, కేవలం హోదా కోసమే కోరుకునేవైతే మరో రేటు. ఎన్నికల్లో కోట్లాది రూపాయిలు ఖర్చు చేశామని, ఊరికే ఏదీ రాదని ప్రజాప్రతినిధులు నిర్మొహమాటంగా చెప్తున్నారు.
ప్రభుత్వ పెద్దల స్థాయిలో ఇచ్చే పదవులకు రేటు ఎక్కువే పలుకుతోంది. పదవి కావాలంటే, కోట్లలోనే బేరాలు. ఆ స్థాయిలో ఇచ్చేవాళ్లైతే పార్టీలతో సంబంధం లేకపోయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ పరిణామాల్ని గమనిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ పోటీలో తాము పోటీ పడలేమంటూ ఆశల్ని చంపుకుంటున్న వాళ్లు ఎందరో.
చికెన్ సెంటర్ల యజమానుల నుంచి కిలోపై పది రూపాయిలు వసూలు చేస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పోస్టులను ఊరికే ఇస్తారని ఎలా అనుకుంటామని నంద్యాల జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. తమ అభిమాన పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే, తమకేదో జరిగిపోతుందనే ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రతి దానికీ రేటు కట్టడం చూసి, కూటమి నాయకులు నివ్వెరపోతున్నారు. ఇలాగైతే ఈ రాజకీయ వ్యవస్థలో తాము ఇమడలేమని ఆవేదనతో నిట్టూర్చుతున్నారు.
Asalu ilantivi modalettinde aa maha metha family kadaa
Avunu
మా “లంగా మోహన” అయితే 11 పైసల్ కూడా తీసుకోకుండా, పదవులకోసం పోటీ పడుతున్న వాళ్ళ బట్టలూడదీసి ఎవరిది పొడుగుంటే వాళ్లతో భర్తీ చేసి రాత్రిళ్ల్లు
” ఆ సర్వీస్” చేయించుకునేవాడు.. ఇదీ “T ప్యాలెస్ ఫైల్స్ ” రహస్యాలు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,