తెగిన బంధాలు

మానవ సంబంధాల పునాదులు ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటి మిథ్యాత్మక పదాలమీద నిర్మితం అవుతాయనే భ్రమల్లో ముప్పావు వంతు ప్రపంచం.. బతుకుతూ ఉంటుంది.

మానవ సంబంధాల పునాదులు ఎక్కడ ఉంటాయి?
మన బుద్ధి, జ్ఞానం అనుమతించిన మేరకు మనం ఎటువంటి జవాబు అయినా చెప్పవచ్చు. ఏ సమాధానం కూడా తప్పు కాబోదు! ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందనే సిద్ధాంతం వర్తించని కొన్ని సంగతుల్లో మానవ సంబంధాలు కూడా ఉంటాయి. ఎవరి అనుభవాన్ని బట్టి.. వారికి ఆయా అనుబంధాల యొక్క పునాదులు భిన్నంగానే కనిపిస్తుంటాయి.

ఏ పునాదుల మీద నిర్మితమైన మానవ సంబంధాలు అయినప్పటికీ.. వాటిని శిథిలం చేయగల శక్తిమంతమైన శతఘ్నులు కూడా కొన్ని ఉంటాయి. పునాదులు ఎన్ని రకాలు ఉండగలవో.. తత్సమానంగా వాటిని కూల్చగల శక్తులు ఉండవు. పరిమితంగానే ఉంటాయి. అయినా వాటి గురించిన స్పృహ, జాగరూకత మనకు ఉండదు. తెలియకుండానే వాటికి మనం బానిసలుగా మారిపోతుంటాం! పర్యవసానమే ఎంతో పదిలం అనుకునే మానవ సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. నలుగురూ ఆదర్శంగా తీసుకునే పెద్దల కుటుంబాలలో, పాఠాలు నేర్చుకోగలిగేలా శిథిలమవుతున్న అనుబంధాల పర్యావలోకనమే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘తెగిన బంధాలు’!

కార్ల్ మార్క్స్ ను అనేకమంది అనేక కోణాల్లో ఒక మహనీయుడిగా పరిగణిస్తుంటారు. ఆయన ప్రవచించిన కమ్యూనిజం, సోషలిజం ఇవన్నీ కూడా రాజకీయ భావవైరుధ్యాలకు ఆస్కారం కల్పించగలవి గనుక.. వాటిని పక్కన పెడదాం. కానీ.. సకల మానవాళి కూడా ఏదో ఒక దశలో ఒప్పుకుని తీరవలసిన జీవిత సత్యాలను కూడా ఆయన ప్రతిపాదించారు. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనేది ఆయన ప్రతిపాదించిన ఒకానొక జీవిత సత్యం! మానవ సంబంధాల పునాదులు ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటి మిథ్యాత్మక పదాలమీద నిర్మితం అవుతాయనే భ్రమల్లో ముప్పావు వంతు ప్రపంచం.. బతుకుతూ ఉంటుంది. కానీ జీవితకాలం ముగిసేలోగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో, జాగృత క్షణంలో కార్ల్ మార్క్స్ చెప్పిన పరమసత్యాన్ని మాత్రం అంగీకరించి తీరుతారు.

అవును. అందుకే, ఆర్థిక పునాదుల నిర్మితమైన బంధాలు.. ఆర్థిక కారణాల పర్యవసానంగానే శిథిలమూ అవుతున్నాయి. చిన్న కుటుంబాలలో.. ‘డబ్బు’ అనే పదార్థం వారి నిత్య జీవితాలను అమితంగా ప్రభావితం చేస్తున్న చోట, ప్రతిరూపాయీ వారికి అత్యవసరం అవుతూ ఉండే చోట.. ఆర్థిక కారణాలు అనుబంధాలను ప్రభావితం చేయడం వింత కాదు. కానీ.. కులీనుల కుటుంబాలలో.. సంపదలకు ఇరుపక్షాలూ చిరునామాలుగా వెలిగే చోట.. కూడా మానవ సంబంధాలు ఎందుకు శిథిలమవుతాయి? అని కొందరికి సందేహం కలగవచ్చు. కానీ.. మార్క్స్ చెప్పిన వేదం లాంటి మాట అంత బలమైనది మరి! ఎవరికి ఎంత సంపద ఉన్నదనేది మాత్రమే ముఖ్యం కాదు.. ఆ సంపదల పట్ల ఎవరికి ఎంత లాలచ్, వ్యామోహం ఉన్నదనేది కూడా కీలకంగా బంధాలను నిర్దేశిస్తుంటుంది. అందుకే తెలుగునాట ప్రముఖంగా చెప్పుకోదగిన సెలబ్రిటీల కుటుంబాల్లో కూడా బంధాలు పుటుక్కున తెగిపోతున్నాయి.

వేదం చెప్పే మహా మృత్యుంజయ మంత్రం చావు ఎలా ఉండాలనేది చక్కగా నిర్దేశిస్తుంది. ‘బాగా మాగిన దోసపండు తొడిమ నుంచి ఏ రకంగా అయితే వేరు పడుతుందో.. అలాంటి సునాయాసమైన రీతిలో మృత్యువు ఉండాలి దేవుడా..’ అని చెబుతుంది. చావు సంగతి ఏమో గానీ.. మానవ సంబంధాలు మాత్రం అంతే సునాయాసంగా తెగిపోతున్నాయి. నిశ్శబ్దంగా తెగిపోతున్న బంధాలు వేలకువేలుగా ఉండవచ్చు.. కానీ కొన్ని బంధాలు ఊరంతా గగ్గోలెత్తిపోయేంత గోలగోలగా మారుతూ తెగుతున్నాయి. అలాంటి ‘తెగిన బంధాల గురించే మనం చెప్పుకోబోతున్నది!

వైఎస్ రాజసానికి అప్రతిష్ట!

వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక మేరునగ సమానమైన అధ్యయాన్ని తానుగా సృష్టించుకుని సెలవుతీసుకున్న ప్రజానాయకుడు. సుదీర్ఘమైన తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. ప్రజాదరణ పరంగా ఆయన తన యావజ్జీవితంలో ఏనాడూ కరవులో లేరు. కానీ ఆర్థికంగా నిమ్నోన్నతాలను చూశారు. ప్రజాజీవితంలో క్లిష్టకాలంలో ఇబ్బందులు పడుతూ, మిత్రుల సహకారం అర్థిస్తూ అడుగులు వేశారు గానీ.. తన రాజసానికి లోటు రానివ్వలేదు. కానీ.. ఆయన వారసుల చరిత్ర ఆ బాటలో సాగడం లేదు. అధికారికంగా అయినా కనీసం వందల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కానీ రాజసమే లుప్తమైంది. అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి గానీ.. ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్లు రోడ్డున పడ్డారు. ఎంతో ఆత్మీయమైన, అతులితమైన వారిద్దరి బంధం ఎన్నడో తెగిపోయింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో పుట్టిన చిచ్చు ఆశ్చర్యకరమైనది! ఇక్కడ ఎవ్వరు ఎలాంటి లేమిలోనూ ఉన్నవారు కాదు. ఏ ఆస్తుల గురించి అయితే అన్నా చెల్లెలు తగాదా పడుతున్నారో అసలు ఆ ఆస్తులు పూర్తిగా పరిగణనలో లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా జరుగుబాటు లేని స్థితిలో ఉభయ పక్షాలలో ఏ ఒక్కరూ లేరు. అయినా సరే అచ్చంగా ఆస్తుల ప్రాతిపదికగా అన్నాచెల్లెళ్ల మధ్య అనూహ్యమైన యుద్ధం మొదలైంది.

కుటుంబ సన్నిహితుల సమక్షంలో చెల్లెలికి కొన్ని ఆస్తులు భాగాలు పెడుతూ ముందు జాగ్రత్త అన్నట్టుగా సరస్వతీ పవర్ సంస్థలోని షేర్లను తల్లి వై ఎస్ విజయలక్ష్మి పేరిట గిఫ్ట్ డీడ్ ద్వారా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. బహుశా ఈ ఏర్పాటు జరిగిన నాటికి– చెల్లెలు తనకు భవిష్యత్తులో ఆగర్భ శత్రువుగా మారుతుందనే ఊహ కూడా జగన్మోహన్ రెడ్డి మదిలో మెదలి ఉండకపోవచ్చు! ఆ తర్వాత పరిణామాలలో ఇద్దరి మధ్య శత్రుత్వం తారస్థాయికి చేరింది. జగన్ సహజంగానే షర్మిలను ఇగ్నోర్ చేశారు. పట్టించుకోవడం మానేశారు. రాజకీయంగా తన శక్తి సామర్థ్యాల గురించి అతిగా ఊహించుకున్న వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాను– అంటూ అక్కడ తండ్రి పేరుతో ఒక పార్టీ స్థాపించి ప్రహసనం నడిపించారు.

ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయినట్టుగా, తెలంగాణలో తాను కూడా ముఖ్యమంత్రి అయిపోతానని కలగన్నారు. పాదయాత్ర లాంటివి కూడా ఆమె చేపట్టారు. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గాలిలో విహరిస్తున్న ఆమె ఊహలు నేల మీదికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా బోధపడ్డాయి. వేరే గత్యంతరం లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎదుట దేబిరించి మరీ తన పార్టీని ఆ సముద్రంలో విలీనం చేశారు షర్మిల. అందుకు ప్రత్యుపకారంగా ఏమీ పొందలేకపోగా.. కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఠికానాలేని, గతి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకొని అక్కడికేదో మహా విజయం సాధించినట్లుగా మురిసిపోయారు.

విశ్లేషకులు పరిగణించే ప్రకారం షర్మిల కు కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడటం కాదు– కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బతికే ఉన్నదని ఏపీ ప్రజలు విశ్వసించడానికి తగినట్లుగా ఆమె ఏపీ రాజకీయాలలో అస్తిత్వ ప్రదర్శన చేశారని అంతా అనుకున్నారు.

అన్నా చెల్లెళ్ల మధ్య పుట్టిన ఈ తగాదా కేవలం ఆర్థిక పునాదుల మీద నిర్మితమైనది మాత్రమే కాదు. ఈగోలు, వ్యక్తిగత అహంభావాలు, అహంకారాలు, రాజకీయ అధికార వ్యామోహం ఇలాంటివన్నీ కలసి రెండు కుటుంబాలను రెండు వైరి పక్షాలుగా చీల్చేసాయి. కొడుకు జగన్మోహన్ రెడ్డి పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలను కలిగి ఉండే వైఎస్ విజయమ్మ కూడా– ఇప్పటికి పూర్తిగా షర్మిల పక్షం వహిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతిల మీద నేరుగానే విమర్శలకు పూనుకుంటూ, విజయమ్మ రాజకీయ గేమ్ లో తాను కూడా ఒక భాగంగా మారిపోతుండడం గమనించాల్సిన సంగతి! కేవలం ఆర్థిక అహంకార కారణాలు మాత్రమే కాదు.. జగన్ రాజకీయ ప్రత్యర్ధుల క్రీడలో తమను తాము వారి పావులుగా మార్చుకునే ధోరణి కూడా ఒకటి!

చంద్రబాబు నాయుడు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనాం చేయడానికి ఆయనకు ఉపయోగపడుతున్నారనే విమర్శలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తరచిచూస్తే మానవ సంబంధాలు శిథిలమైపోవడానికి ఆర్థిక అహంకార కారణాలు మాత్రమే కాదు.. ఇతర పార్టీల వారి కుట్రలు కూడా ఒక కీలక భూమిక పోషిస్తాయి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

మెగా అల్లు కుటుంబాల మధ్య..

ఇక్కడ పంపకాలకు సంబంధించిన వివాదాలు లేవు. అలాగని ఆర్థిక కారణాలు ఏమాత్రమూ లేవనడానికి కూడా అవకాశం లేదు. ఆర్థిక పునాదుల మీద పెరిగిన అసూయ, ఈర్ష్య ఇక్కడ బంధాలను ప్రభావితం చేశాయని చెప్పుకోవాలి. మొత్తానికి చిరంజీవి– అరవింద్ మధ్య అనుబంధం గతించిన వైభవంగా మారిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి– ఆయన బావమరిది అల్లు అరవింద్ ల గురించి ఒకప్పట్లో సినిమా ఇండస్ట్రీలో కృష్ణార్జునుల స్థాయిలో చెప్పుకునేవారు. చిరంజీవి విజయాల వెనుక వ్యూహరచన సామర్థ్యం మొత్తం అల్లు అరవింద్ దే అనే ప్రచారం కూడా ఒక దశలో ఉండేది. ప్రచారాలు ఏవి ఎలా సాగినప్పటికీ ఈ బావ బావమరుదులిద్దరూ అన్యోన్యమైన బంధంతో సినిమా ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్‌గా చెలామణీ అయ్యారని చెప్పవచ్చు.

అల్లు అరవింద్ కుటుంబం నుంచి హీరోలు తయారైనప్పటికీ– రెండు కుటుంబాలను ఒక్కటిగానే పరిగణిస్తూ అందరూ మెగా కాంపౌండ్ అనే పేరుతోనే వ్యవహరించేవారు. ఒకటో తరంలో ఎంతో దృఢంగా పదిలంగా కొనసాగిన ఈ బంధానికి తర్వాత బీటలు పడ్డాయి. ఆర్థిక కారణాల రూపంలో ఆస్తి తగాదాలు ఇక్కడ లేవు. కానీ స్టార్ డమ్ సంపాదించుకోవడంలో, తమ సినిమాల కలెక్షన్ల విషయంలో ఒకరి పట్ల ఒకరికి పోటీతత్వం ఏర్పడింది. స్పర్ధయా వర్ధతే విద్యా అంటారు పెద్దలు. అసూయ అనేది మనల్ని మనం నైపుణ్యాల పరంగా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడాలి అని దీని భావం. కానీ వీరి విషయంలో పరస్పర ద్వేషబీజాలకు దారితీసింది. ఒకరినొకరు వెటకారపు మాటలు అనుకోవడం, మొహాలు కూడా చూసుకోలేనంత.. కామన్ గా ఒక వేదిక మీద కనిపించకుండా దూరం కొనసాగించేంత పరిస్థితులు అనుకోకుండానే ఏర్పడ్డాయి.

నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి రాజకీయాలు కూడా తమ వంతు దోహదం చేశాయని చెప్పాలి. రాజకీయాలు ఈ రెండు కుటుంబాలను దూరం చేయడం అనేది రెండు దశలలో జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కంటే ఎక్కువగా అల్లు అరవింద్ పార్టీ వ్యవహారాల బాధ్యత చూశారు. మహా మహా వీవీఐపీలు చిరంజీవిని కలవదలచుకున్నా కూడా అల్లు అరవింద్ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడే పరిస్థితి ఉండేది. పార్టీకి అన్నీ తానే అయి నడిపించిన తరువాత ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. పార్టీ ఆర్థిక లావాదేవీలు కూడా అల్లు అరవింద్ పర్యవేక్షణ లోనే జరిగాయి. ఆ దిశగా చిరంజీవి పార్టీ అనేక విమర్శలు మూటగట్టుకుంది. పార్టీ పతనం అయిన తర్వాత.. కారణాలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నప్పుడే.. అల్లు అరవింద్ మీద చిరంజీవిలో అసంతృప్తి వచ్చినట్టుగా చెప్పుకున్నారు. క్రమంగా ఆ దూరం పెరుగుతూ వచ్చింది గానీ.. బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రెండో తరంలో వారసుల జమానా నడుస్తున్న రోజుల్లో రాజకీయాలు మరో రకంగా ప్రభావం చూపించాయి. పవన్ కల్యాణ్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత.. మెగా ఫ్యామిలీ ఆయనకు అండగానే ఉంది. అల్లు అర్జున్– జగన్మోహన్ రెడ్డి కోసం కాకపోయినప్పటికీ.. వైసీపీ పక్షంవైపు సానుకూలంగా మారారు. ఇవి కుటుంబాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. తాజాగా సినిమాల విడుదల తర్వాత.. ఒకరి విజయాన్ని మరొకరు హర్షించలేకపోగా, ఒకరి పరాజయాన్ని మరొకరు వేదికలమీదనే వెటకారం చేసే పరిస్థితులు వచ్చాయి. ఇక దూరం పెరగక ఏమవుతుంది. బంధం తెగకుండా ఉంటుందా? నిజానికి ఈ పరిణామాలన్నీ ఎన్నడో తెగిపోయిన బంధానికి తాజాగా బయటపడుతున్న రుజువులు మాత్రమే.

నందమూరి వారసులు తక్కువ తినలేదు..

మెగా కాంపౌండ్ లో ఒక తరం దాటి రెండో తరం రాజ్యమేలుతున్న రోజుల్లో మొత్తంగా రెండు తరాల మధ్య వైరుధ్యాలు వచ్చాయి. తెలుగు సినిమా పరిశ్రమలో అంతే బలమైన మరో కాంపౌండ్ నందమూరి ఫ్యామిలీలో రెండు తరాల మధ్య దూరం పెరగడమే చిత్రం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు తరాల ప్రతినిధుల మధ్య.. ఎన్నడూ దృఢపడని ఒక బంధం.. పలచనైనా ఆ ఆస్తిత్వాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఎన్నడో తెగిపోయింది. ఆ తెగిన బంధానికి ఇరువైపులా మిగిలిన రెండు తరాల వారసులే.. బాలకృష్ణ– జూనియర్ ఎన్టీఆర్!

నందమూరి కుటుంబంలో తొలి నుంచి ఎవరికి వారే అన్నట్లుగానే నడుపుతున్నారు. అయితే నందమూరి తారక రామారావు కు వారసులుగా ఎన్నదగినంతటి స్థాయికి చేరిన వారు బాలకృష్ణ, ఎన్టీఆర్ మాత్రమే. వీరిద్దరి మధ్య ఏనాడూ అనుబంధం పదిలంగా సాగలేదు. ఒకే కుటుంబంగా స్టార్ డమ్ అనుభవిస్తున్నప్పుడు.. అవసరార్థంగా కొంత వరకు ప్రేమలు వ్యక్తమయ్యాయి. కానీ అవేవీ నిజం కాదు.

ఒక రకంగా.. నందమూరి అనుబంధాలను దృఢంగా మార్చుకోవడానికి ఎన్టీఆర్ వైపు నుంచి ఎక్కువ ప్రయత్నాలే జరిగాయి గానీ.. ఆ కాంపౌండ్ అంతగా అనుమతించలేదు. ప్రత్యేకించి బాలయ్య తొలినుంచి తనదైన శైలిలోనే వ్యవహరించారు. ఎన్టీఆర్ తన మనోభీష్టానికి భిన్నంగా ‘అతికించుకోవడం’ కోసం చేసిన ప్రయత్నాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కానీ కష్టం మిగిలిందే తప్ప.. ఆయనను నందమూరి కాంపౌండ్.. తమ సహజ భాగస్వామిగా ఆమోదించలేదు. ముందే చెప్పుకున్నట్టు.. తొలినుంచి పలచగానే ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది. ఎన్టీఆర్ కూడా.. ఇక బంధాల గురించి ఆలోచించడం మానేసి.. పూర్తిగా కెరీర్ ఒక్కటే చాలనుకున్నారు.

మంచు రగడ.. పక్కా మాస్!

సెలబ్రిటీల కుటుంబాల్లో బంధాలు తెగిపోవడంలో అందరిదీ ఒక ఎత్తు అయితే మంచు ఫ్యామిలీలో రచ్చ మరొక ఎత్తు. ఊర మాస్ సినిమాను తలపించే రచ్చ అది. కేవలం ఆస్తులు తప్ప మరో ప్రాతిపదికలేదు. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్.. జనం ఎదుట రోడ్డున పడి ముష్టిఘాతాలతో కొట్టుకోలేదు.. అంతే! అంతకు మించిన రాద్ధాంతాలు చాలా చాలా బహిరంగంగానే నడిపించారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి మాత్రమే తాము ఉదాహరణలమని.. తమ బంధం తెగిపోవడానికి ఇతరత్రా ఎలాంటి కారణాలూ అక్కర్లేదని నిరూపించడానికి పూనుకున్నట్టుగా అన్నదమ్ములు తయారయ్యారు.

మంచు మోహన్ బాబు విషయానికి వస్తే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఇవాళ తనకంటూ ఉన్న స్థానాన్ని పూర్తిగా తన రెక్కల కష్టంతో నిర్మించుకున్నారు. కానీ పిల్లల సంగతి అలా కాదు. సమస్య అక్కడే వచ్చింది. మోహన్ బాబు ఆస్తులకు వారసులనే హక్కులు కోరుకునే తత్వం వారిలో బలపడింది. అంతే తప్ప.. చిన్నస్థాయి నుంచి ఎదిగిన, కష్టపడే తత్వానికి వారసులుగా తయారు కావాలనే పట్టుదల వారిలో కొరవడింది. తన పిల్లల్లో అలాంటి తత్వాన్ని నూరిపోయడంలో మోహన్ బాబు విఫలం అయ్యారు. పర్యవసానమే.. ఇవాళ ఎన్నడూ ఎక్కడా లేనంత స్థాయిలో ఆ కుటుంబ వివాదాలు బజార్న పడ్డాయి. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఇలాంటి ఉదాహరణలన్నీ తెలుసుకున్నంత మాత్రాన, వీటినుంచి పాఠాలు నేర్చుకున్నంత మాత్రాన.. మాన సంబంధాలకు ఆర్థిక కారణాలు పునాదుల్లో ఉండకుండా పోవు! కార్ల్ మార్క్స్ చెప్పిన వేదం లాంటి సత్యం.. మారిపోదు. కాకపోతే.. ఆర్థిక కారణాలు బంధాలను తెంచేస్తుంటాయనే స్పృహ కలిగి ఉంటే.. అలాంటి దెబ్బలకు మనం గురికావడం తక్కువగా జరుగుతుంటుంది. కానీ ఇవాళ్టి తరంలో కార్ల్ మార్క్స్ కు కూడా అవగాహన లేని అనేకానేక కోణాలు, కారణాలు మానవ సంబంధాలను తెంచేస్తున్నాయి. వాటన్నింటి పట్ల కూడా మనం అవగాహన పెంచుకుంటూ ఉండాలి.. బంధాలు కావాలనుకునేట్లయితే!

.. ఎల్ విజయలక్ష్మి

23 Replies to “తెగిన బంధాలు”

  1. vijji akkaa nuvvu cheppina vaatilo kalasi nadavaka poyinaa hundhaaga yeari pani vallu chesukuntundhi nandhamuri family maathrame kigilina 3 kutumbaalu nuvvu cheppinatle vunnayi.

  2. జగన్ తన ప్రయత్నాల్లో వున్నప్పుడు షర్మిల ఆడ మనిషి అయిన కూడా, తన పరిధి కి మించి పాదయాత్రలు చేసి జగన్ అధికారం లోకి రావడంలో తోడ్పడ్డారు. అప్పట్లో కూడా అప్పటి ప్రభుత్వం బలంగానే వున్నది. అయినా షర్మిల వెనుకాడలేదు

    మరి, ఆవిడ ఏమి సిఎం పదవి అడగలేదే! ఏదో ఒక ఎంపీ పదవి, తండ్రి పరపతి ద్వారా సంపాదించిన ఆస్తులు లో తండ్రి ఇవ్వాలి అని చెప్పిన వాటా అడిగింది.

    ఆ రెండు కూడా జరగనివ్వ లేదు.

    సర్లే తన ప్రయత్నం తాను చేసుకుందాము అనుకుని తెలగణ లో పార్టీ పెట్టిన కూడా, కనీసం మాట సాయం కూడా చేయలేదు.

    ఇక్కడ చేయాల్సిన అవసరం, చేయగలిగిన సత్తా వుంది కూడా జగన్ చేయలేదు.

    1. షర్మిల కొడుకు కి జగన్ రెడ్డి కూతురు వరస కాబట్టి బంధం కలుపుకోవాలి అని వైఎస్ఆర్ వున్నప్పటి నుండి అనుకునేవాళ్లు అని ఆ ఫ్యామిలీ కి క్లోజ్ గా వుండే వాళ్ళకి తెలుసు. జగన్ సిఎం కాగానే ఆ ఆలోచన కూడా కుదరదు అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది.

      ఈ విధంగా అన్ని వైపులా నుండీ, షర్మిల తన సొంత ఆన్న చేతుల్లో అవమానం పాలు అయ్యింది.

    2. అటు తమ పిల్లలకి కలుపుకోవాలి ఆన్న పెళ్లి ఆలోచన కూడా కుదరదు అని చెప్పేశారు. ఆ రకంగా షర్మిల అన్ని రకాలుగా ఆన్న చేతిలో మోస*పోయారు.

  3. అన్న చెల్లెలు కలిసుంటే మధ్యలో దూరటానికి మోడీ కూడా సాహసం చేయడు. విడిపోయి అవకాశం ఇచ్చింది మీరు . రాజకీయాల్లో అవకాశం ఉన్నప్పుడు వాడుకోకుండా ఉండటానికి అక్కడ జూనియర్స్ ఎవరో లేరు. నువ్వు రాసిన ఆర్టికల్ లో ఎదుటి వారి మీద ఏడ్వటం తప్పితే ఏమీ లేదు.రక్తం లో కూడా రాజకీయమే ప్రవహించేది మీ ఒప్పొసిషన్ లీడర్ లో అయితే , ప్రతి అక్షరం లో విషం నింపుకున్న కుంచితత్వం నీది.

  4. వీడు Y.-.S కుటుంబం లొ లుకలుక గురించి రాయల్సి వచ్చి.. Y.-.S కుటుంబం తొ పాటు అందరి గురించి రస్తూ.. అబ్బె ఇది చాలా కామనె అని చెప్పె ప్రయత్నమె ఇది!

    1. అవినీతి సొమ్ము పంచుకొవటం లొ తెడాలు వచ్చి తన్నుకుటున్నది మాత్రం మన…

  5. nandamuri family – balakrishna and his brother’s son. same family tree. YS family jagan vs sharmila. same family tree. comparing them make sense. why are you bringing mega family ? chiranjeevi,naga babu, PK and their kids have very good bonding. jaglak laagaa chelleluni ammani mosam cheyaledhu. asalu nee badha ente pichidhaanaa?

  6. బాబాయిని చంపటం వాళ్ళ వాళ్ళు విడిపోతే అది ఆర్ధిక సమస్యవల్ల విడిపోయారని బలే కవర్ చేస్తున్నావుగా ???

  7. దోచుకోవడమే రాజసం అంటే మహామేత గాడిది రాజసమే!!

    నువ్వు చెప్పిన అన్నిటికన్నా గలీజ్ బంధం నిస్సందేహంగా మాడా అన్నా తేడా షెల్లీ మాత్రమే సుమీ!!

  8. దోచుకోవడమే రాజసం అంటే మ*హా*మే* త గాడిది రాజసమే!!

    నువ్వు చెప్పిన అన్నిటికన్నా గ*లీ*జ్ బంధం నిస్సందేహంగా మా*డా అన్నా తేడా షెల్లీ మాత్రమే సుమీ!!

  9. దోచుకోవడమే రాజసం అంటే మ*హా*మే* త గాడిది రాజసమే!!

    నువ్వు చెప్పిన అన్నిటికన్నా గ*లీ*జ్ బంధం నిస్సందేహంగా మా*డా అన్నా తేడా షెల్లీ మాత్రమే సుమీ!!

  10. దోచుకోవడమే రాజసం అంటే మ*హా*మే* త గాడిది రాజసమే!!

    నువ్వు చెప్పిన అన్నిటికన్నా గ*లీ*జ్ బంధం నిస్సందేహంగా మా*డా అన్నా తేడా షెల్లీ మాత్రమే సుమీ!!

  11. అందరివీ ఓ లెవెల్ కానీ “తోకలేని A1సింహం” కొట్టేసిన కోట్ల కోసం కస్టపడి కుర్చీ ఎక్కించిన, సొంత చెల్లినే గోడకి కొట్టి బంధం తెంచుకున్నాడు.. వాడిని ఊరికే వదిలే ఛాన్సె్ లేదు.

Comments are closed.