తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన చెందారు. అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పరిస్థితి మూడు నెలల కిందట ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. అంటే ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లుగానే ఉందన్నారు. అప్పుడు నాయకులు ఏం చెప్పారో, తాను డైరీలో ఏం రాసుకున్నానో ఇప్పుడూ అదే చెబుతున్నారని ఆగ్రహించారు.
పైగా చీటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ యాక్టవ్ మెంబర్షిప్ విషయంలో తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని బన్సల్ అన్నారు. 13 వేల యాక్టివ్ మెంబర్షిప్లు చేయకపోయినా చేసినట్లుగా చూపించి మోసం చేశారని అన్నారు. ప్రజాసమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడటంలేదన్నారు. వర్క్షాపులు, మీటింగులు పెట్టుకుంటే సరిపోదన్నారు. నాయకుల నిర్లక్ష్యం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని అన్నారు. మండల కమిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు.
మే 15వ తేదీలోగా మండల కమిటీలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. లేదంటే జిల్లాల అధ్యక్షులు రాజీనామాలు చేయల్సి ఉంటుందని హెచ్చరించారు. పోరాటాల్లోనూ వేడి తగ్గిందని.. క్షేత్రస్థాయి పోరాటాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్దంగా ఉన్నారని, నాయకులే ప్రజలు వద్దకు వెళ్లడంలో విఫలమయ్యారని, వారి సమస్యల పట్ల స్పందించి పరిష్కారం లభించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుంటే రాజకీయంగా ఏ నాయకుడూ ఎదగలేడని చెప్పారు.
తెలంగాణలో గత ఎన్నికల ప్రచారానికి వ్యాన్స్ ఇచ్చామని, అయినా నాయకులు ఎక్కడా తిరగలేదని అన్నారు. రాష్ట్ర ఇన్చార్జి ఇంత ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. పార్టీ నాయకులపై తరచుగా విమర్శలు చేసే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండురోజుల కిందట మాట్లాడుతూ ‘మా వాళ్లే కరెక్టుగా ఉంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది’ అన్నాడు. మొత్తంమీద రాష్ట్రంలో బీజేపీ నాయకులు సరిగా పనిచేయడంలేదన్న అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో కూడా బలంగా ఉంది.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో యే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అంటగాకుతుంది బీజేపీ .పొత్తులో ఉన్నా లేకపోయినా వాళ్ళకేం మేటర్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే వెధవ పనులు చూసి చూడనట్టుగా ఉంటే % పడేస్తారు.
బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి గా పోయిన సారి కంటిన్యూ చేసి ఉండుంటే పోటా పోటీ గా వచ్చేవారు.BRS మీద అప్పట్లో వున్న తీవ్ర వ్యతిరేకత ని కాంగ్రెస్ కాష్ చేసుకుంది. సంజయ్ ని మార్చి బీజేపీ ని పోటీ నుండి తప్పించారు. ఇప్పటికైనా సంజయ్ ని మళ్ళీ స్టేట్ లో ఆక్టివ్ చెయ్యండి.2028 లో సెకండ్ ప్లేస్ లో వుంటారు.