ఇద్దరు అన్నదమ్ములు ముచ్చటించుకోవడంలో, మంతనాలు జరపడంతో వింతేమీ లేదు. కానీ మెగా బ్రదర్స్ చిరు అండ్ పవన్ ఓ గంట సేపు భేటీ వేసి ముచ్చటించుకున్నారు అంటే అది కచ్చితంగా విశేషమే. ఎందుకంటే ఒకాయిన కాంగ్రెస్ కంపెనీలో స్లీపింగ్ పార్టనర్. మరొకాయిన తెలుగుదేశం స్పాన్సర్డ్ బ్రాండ్ న్యూ కంపెనీకి సిఇఓ. ఒకటి కుడివైపు చూస్తే, రెండవది ఎడమవైపు చూసే వ్వవహారం. మరి అలాంటి ఇద్దరు కలిసి ఒక గంట ముచ్చట్లాడుకున్నారు అంటే అది కాస్త విశేషమే.
పవన్ రాజకీయంగా మెలమెల్లగా క్రియాశీలకం అవుతున్నారు. చిరు తన 150 వ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రామ్ చరణ్ స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు. మరోపక్క చిరు కాంగ్రెస్ నుంచి భాజపాలోకో, తేదేపాలోకో వెళ్తారని వందతులు వున్నాయి. పవన్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతుందని టాక్ వుంది. మరి ఇలా ఇన్నింటి నడుమ ఈ ఇద్దరు ఓ గంట ముచ్చటించుకున్నారు అంటే కాస్త ఆసక్తి కరమే. కానీ ఏయే విషయాలపై ముచ్చటించుకుని వుంటారన్నది ఆ ఇద్దరికే తప్ప వేరెవరికి తెలియదు కదా?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు