ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీని బీజేపీ సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు ఏకిపారేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కుట్రపూరితంగా టీడీపీ, జనసేన ప్రచారం చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో "మీ భూమి మీది కాదు" అనే నినాదంతో చంద్రబాబునాయుడు అధికారికంగా ఎల్లో పత్రికల్లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.
ఈ దుష్ప్రచారంపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ఎక్స్ వేదికగా ఘాటైన పోస్టు పెట్టారు. ఈ పోస్టుతో పాటు ఎల్లో పత్రికలో వచ్చిన ప్రకటనను కూడా ఆయన షేర్ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు పోస్టు ఏంటంటే...
"ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?"
ఇదీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు. ఐవైఆర్ చాలా స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ తమ పార్టీ జాతీయ నాయకత్వమని వెల్లడించారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన తెలిపారు. ఈ ప్రకటనలో బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రకటనలకు ఏపీ బీజేపీ ఎలా బాధ్యత తీసుకుంటుందని కూడా ఆయన నిలదీశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం. ఐవైఆర్ కృష్ణారావు ఘాటు పోస్టుపై బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో మరి!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు