Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఖైదీ ఫంక్షన్ చెట్టెక్కేసిందా?

ఖైదీ ఫంక్షన్ చెట్టెక్కేసిందా?

ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా అభిమానులకు థాంక్స్ గివింగ్ పేరిట ఓ భారీ ఫంక్షన్ చేయాలనుకున్నారు మెగాస్టార్ అండ్ రామ్ చరణ్. ఈ మేరకు వార్తలు వచ్చేసాయి. ఒకటి రెండు డేట్లు కూడా బయటకు వచ్చేసాయి. కానీ మరి ఏమయిందో? ఇప్పుడు ఆ ఫంక్షన్ ఊసే ఎక్కడా బయటకు రావడంలేదు. 

ఈలోగా ఖైదీ 150 జోరు పూర్తయిపోయింది. థియేటర్లలో చాలా వరకు డెఫిసిట్ లోనే నడుస్తున్నాయి. అయితే 50 రోజుల వరకు వుంచమని మెగా క్యాంప్ నుంచి గట్టి ప్రెజర్ రావడంతో థియేటర్లలోరన్ చేస్తున్నారు. అయినా కూడా ఈవారం, వచ్చేవారం కొన్ని థియేటర్లు జారిపోతాయని వినికిడి. 50 రోజులు కావాలంటే ఇంకా రెండు వారాలు ఆగాలి.

ఇలాంటి టైమ్ లో మరి ఫంక్షన్ చేసే మూడ్ నుంచి మెగాస్టార్ అండ్ చరణ్ దూరమైనట్లు తెలుస్తోంది.  మరీ కావాలనుకుంటే యాభై రోజులు దాటిన తరువాత ఆలోచిద్దాం అని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. అయినా సినిమా విడుదలకు ముందు అభిమానులు, ఇతరత్రా వ్యవహారాలు అవసరం కానీ, ఇప్పుడు కలెక్షన్లు అన్నీ అయిపోయిన తరువాత ఫంక్షన్ చేస్తే ఏంటీ? చేయకపోతే ఏంటీ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?