‘కోబ‌లి’కి కొబ్బరికాయ్‌?

జ‌ల్సాతో ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్రమ్‌ల మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. అత్తారింటికి దారేదితో విశ్వరూపం దాల్చింది. హీరో, ద‌ర్శకుడిగా కాదు.. ఇద్దరు మిత్రుల్లా క‌లిసిపోయారు. ఇద్దరి ఆలోచ‌న‌లు, ఆద‌ర్శాలు ఒక్కటే. కాబ‌ట్టి మ‌రింత మ‌మేక‌మైపోయారు. Advertisement…

జ‌ల్సాతో ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్రమ్‌ల మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. అత్తారింటికి దారేదితో విశ్వరూపం దాల్చింది. హీరో, ద‌ర్శకుడిగా కాదు.. ఇద్దరు మిత్రుల్లా క‌లిసిపోయారు. ఇద్దరి ఆలోచ‌న‌లు, ఆద‌ర్శాలు ఒక్కటే. కాబ‌ట్టి మ‌రింత మ‌మేక‌మైపోయారు.

జ‌న‌సేన విధి విధానాల్లో, ప‌వ‌న్ ఉద్వేగ భ‌రిత ప్రసంగాల్లో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉంద‌ని చెప్పుకొన్నారు. ప‌వ‌న్‌తో `కోబ‌లి` తీస్తాన‌ని త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పాడు. అయితే ఆ సినిమా గురించిన వివ‌రాలేం బ‌య‌ట‌కు రాలేదు. ఎప్పుడ‌న్నదీ స్పష్టత లేదు. ఆ సినిమాకి ఇప్పుడిప్పుడే త‌లుపులు తెర‌చుకొంటున్నాయి. 

గ‌బ్బర్ సింగ్ 2 త‌ర‌వాత 'కోబ‌లి' సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ కూడా త్రివిక్రమ్‌కి మాటిచ్చేశాడ‌ని, ప‌వ‌న్ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం రూపొందే ఛాన్సులున్నాయ‌ని తెలుస్తోంది. అంటే.. 2015లోనే 'కోబ‌లి'కి కొబ్బరికాయ్ కొట్టే అవ‌కాశాలున్నాయ‌న్నమాట‌.