బెల్లం`కొండ‌`లు క‌రిగిపోతున్నాయా?!

త‌న కొడుకికి తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ రావాల‌ని ప్లాన్ చేశాడు బెల్లంకొండ సురేష్‌. అందుకే వి.వి.వినాయ‌క్‌లాంటి మాస్ ద‌ర్శకుడి చేతుల్లో పెట్టేశాడు. వినాయ‌క్‌తో పెట్టుకొంటే గాల్లో సుమోలు పైకి లేస్తాయ‌ని తెలుసు, బాంబులు…

త‌న కొడుకికి తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ రావాల‌ని ప్లాన్ చేశాడు బెల్లంకొండ సురేష్‌. అందుకే వి.వి.వినాయ‌క్‌లాంటి మాస్ ద‌ర్శకుడి చేతుల్లో పెట్టేశాడు. వినాయ‌క్‌తో పెట్టుకొంటే గాల్లో సుమోలు పైకి లేస్తాయ‌ని తెలుసు, బాంబులు భారీగా బ్లాస్ట్ చేయాల‌నీ తెలుసు. అందుకు  డ‌బ్బు మంచినీళ్లల్లా ఖ‌ర్చవుతుంద‌నీ తెలుసు. అయినా కూడా వెన‌క‌డుగు వేయ‌కుండా ఎంత ఖ‌ర్చయినా ఫ‌ర్వాలేదన్నట్టుగా వినాయ‌క్‌ని రంగంలోకి దించాడు. 

భారీ మొత్తం ఇచ్చి స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. అయితే… ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ర‌క‌ర‌కాలుగా ప్రచారం సాగుతోంది. భారీగా డ‌బ్బు ఖ‌ర్చయింద‌నీ,  తొలి సినిమా చేస్తున్న ఏ క‌థానాయ‌కుడిపైనా ఇప్పటిదాకా ఇంత స్థాయిలో ఖ‌ర్చు పెట్టలేద‌ని స‌మాచారం. ఇప్పటికే 30 కోట్లు ఖ‌ర్చయ్యాయ‌నీ, ఇంకా చాలా భాగం స‌న్నివేశాల్ని తీయాల్సి ఉంద‌ని ప్రచారం సాగుతోంది. 

వి.వి.వినాయ‌క్ నిజంగానే బెల్లం`కొండ‌`ని క‌రిగిస్తున్నాడ‌నీ చెప్పుకొంటున్నారు. వి.వి.వినాయ‌క్‌, స‌మంత లాంటి వ్యక్తులు సినిమాకి ప‌నిచేస్తున్నారు కాబ‌ట్టి… మార్కెట్‌కి ఢోకా ఉండ‌దు. భారీస్థాయిలోనే అమ్ముడు పోవ‌చ్చు కానీ… మ‌రీ కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవ‌డం ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఈ సినిమా ప్రోగ్రెస్ విష‌యంలో ఇంకా స్పష్టత రాలేదు.