రజనీకాంత్ ‘వెట్టయ్యన్’ కు భారీ రేటు

రజనీ కాంత్ లేటెస్ట్ సినిమా వెట్టయ్యన్. జై భీమ్ లాంటి మంచి సినిమా అందించిన జ్ఞాన్ వేల్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు భారీ రేటు పలికింది. 14 కోట్లకు తెలుగు…

రజనీ కాంత్ లేటెస్ట్ సినిమా వెట్టయ్యన్. జై భీమ్ లాంటి మంచి సినిమా అందించిన జ్ఞాన్ వేల్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు భారీ రేటు పలికింది. 14 కోట్లకు తెలుగు హక్కులు (సీడెడ్ కాకుండా) అమ్ముడుపోయాయి. ఈ సినిమా మీద భారీ అంచనాలు వుండడమే దీనికి కారణం.

రజనీ వుండనే వన్నారు. తెలుగు నటుడు రానా విలన్ గా చేస్తున్నారు. మలయాళ నటుడు, మన వాళ్లకు పరిచయమైన ఫాహిద్ ఫాజిల్ ఫన్ పండించారని తెలుస్తోంది. కల్కి సినిమాతో మన వాళ్లకు దగ్గరయిన అమితాబ్ ది కీలకపాత్ర. మన కుర్రాళ్లకు క్రేజీ పాయింట్ అయిన మంజు వారియర్ వున్నారు.

ఇంక ఇంత కన్నా కాంబినేషన్ ఏం కావాలి. అందుకే తెలుగు నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారు. సినిమా బాగా వచ్చింది అనే టాక్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ద్వారా తెలుగు నిర్మాతలకు సమాచారం అందింది. దాంతో ఇద్దరు ముగ్గురు యువ నిర్మాతలు పోటీ పడ్డారు. కానీ ఇప్పటికే లైకా సినిమాలు వరుసగా చేస్తున్న ఏషియన్ సంస్థ హక్కులు తీసుకుంది. సీడెడ్ హక్కులు ఎన్వీ ప్రసాద్ తీసుకున్నారు.

ఏడు నుంచి తొమ్మిది కోట్లకు పైగా ఓన్లీ అంధ్ర (సీడెడ్ కాకుండా) అమ్ముడుపోయే అవకాశం వుంది. అలాగే నైజాం హక్కులు ఏడు కోట్ల మేరకు విలువ వుంటుంది. ఈ సినిమా అక్టోబర్ లో విడుదలవుతుంది.

9 Replies to “రజనీకాంత్ ‘వెట్టయ్యన్’ కు భారీ రేటు”

  1. జై భీమ్ లాంటి మంచి సినిమా అందించి ఉంటే కమర్షియల్ ఎంటర్టైనర్ తియ్యగలడా?

Comments are closed.