ఆ హీరో పారితోషకం 40 కోట్లా!

ఒక్క సూపర్ హిట్ తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దశ తిరిగిపోయినట్టుగా ఉంది. ఇటీవలే 'అర్జున్ రెడ్డి'రీమేక్ 'కబీర్ సింగ్'తో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ తన తదుపరి సినిమాకు నలభై…

ఒక్క సూపర్ హిట్ తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దశ తిరిగిపోయినట్టుగా ఉంది. ఇటీవలే 'అర్జున్ రెడ్డి'రీమేక్ 'కబీర్ సింగ్'తో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ తన తదుపరి సినిమాకు నలభై కోట్ల రూపాయల పారితోషకాన్ని అడుగుతున్నాడట. దానికి నిర్మాతలు కూడా ఓకే చెబుతూ ఉన్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం.

బాలీవుడ్ మీడియా వర్గాల కథనం ప్రకారం.. తెలుగులో హిట్టైన 'జెర్సీ' సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. దాంట్లో కూడా షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడు. కరణ్ జొహార్ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. హీరోగా నటిస్తున్నందుకు గానూ షాహిద్ కు నలభై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పాడట కరణ్ జొహార్.

ఇటీవలే 'కబీర్ సింగ్' సినిమా ఏకంగా మూడువందల యాభైకోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లు సాధించింది. దాదాపు యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ సినిమా రూపొందగా ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి.  అప్పుడు కూడా షాహిద్ కపూర్ రెమ్యూనరేషన్ బాగానే ఉంది.

ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషకాన్ని భారీగా పెంచాడట సాహిద్. ఇలా అర్జున్ రెడ్డి రీమేక్ షాహిద్ రేంజ్ ను భారీగా పెంచేసింది! ఆ పెంపుదలను బాలీవుడ్ కూడా ఆమోదించేస్తుండటం గమనార్హం.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!