బందోబస్త్ టీజర్.. చర్చ మొత్తం అల్లు శిరీష్ దే

సూర్య హీరోగా నటిస్తున్న బందోబస్త్ సినిమా టీజర్ రిలీజైంది. సూర్యతో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన మోహన్ లాల్, ఆర్య, సాయేషా క్యారెక్టర్లను పరిచయం చేశారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో రిచ్ గా…

సూర్య హీరోగా నటిస్తున్న బందోబస్త్ సినిమా టీజర్ రిలీజైంది. సూర్యతో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన మోహన్ లాల్, ఆర్య, సాయేషా క్యారెక్టర్లను పరిచయం చేశారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో రిచ్ గా తెరకెక్కిన బందోబస్త్ టీజర్ బాగానే ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి చర్చ మొత్తం అల్లు శిరీష్ చుట్టూ తిరుగుతోంది.

అల్లు శిరీష్ కు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు డిస్కషన్ అతడి చుట్టూ నడుస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ఈ సినిమాలో ముందుగా అల్లు శిరీష్ నే తీసుకున్నారు. టీజర్ లో కనిపిస్తున్న ఆర్య స్థానంలో ఉండాల్సింది అల్లు శిరీషే. షూటింగ్ కూడా స్టార్ట్ చేసి, కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత అల్లు శిరీష్ తప్పుకున్నాడు. కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నానని శిరీష్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు. యాక్టింగ్ సరిగ్గా చేయని కారణంగా అతడ్ని తప్పించారని తమిళ మీడియా కోడై కూసింది.

ఏదైతేనేం అల్లు శిరీష్ స్థానంలోకి ఆర్య వచ్చాయి. సినిమాలో అతడికి కాస్త పెద్ద పాత్రే దక్కింది. యాక్షన్ తో పాటు రొమాన్స్ చేసే స్కోప్ కూడా ఉంది. అలా టీజర్ రిలీజైన తర్వాత అల్లు శిరీష్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బంగారం లాంటి అవకాశాన్ని శిరీష్ పోగొట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. బహుశా అల్లు శిరీష్ కూడా అదే ఫీల్ అవుతున్నాడేమో.

కేవీ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారు.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?