అక్కినేటి నట వారసుడు నాగచైతన్య, ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ సమంత కలిసి సాహసయాత్ర చేస్తున్నారు. ఇది ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో చెప్పిన విషయం కాదు. స్వయంగా సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఎంతో గొప్పగా ప్రకటించారు. సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టీవ్ అనే విషయం తెలిసిందే.
ఎప్పుడూ బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలకు లాక్డౌన్ పుణ్యమా అని కావాల్సినంత తీరిక దొరికింది. షూటింగ్లు బంద్ కావడంతో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో లైవ్లోకి వస్తూ నెటిజన్లు, అభిమానుల చిత్రవిచిత్రమైన ప్రశ్నలకు అంతే చాకచక్యంతో సినీ సెలబ్రిటీలు సమాధానాలు ఇవ్వడం చూస్తున్నాం.
తాజాగా సమంత అక్కినేని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటోతో సమంత , నాగచైత న్యలకు ఎంత మంది అభిమానులున్నారో కూడా తెలిసిపోతోంది. అదెలాగంటే...
సమంత, నాగ చైతన్య, తమ పెంపుడు కుక్క హ్యాష్తో కలిసి కారులో కూర్చున్న ఓ పాత ఫొటోను తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా `దాదాపు ఓ గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాం` అంటూ క్యాప్షన్ కూడా సమంత జత చేశారు.
ఈ ఫొటో, క్యాప్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. నెట్టింట్లో ఈ ఫొటో హల్చల్ చేస్తోంది. ఎంతగా అంటే... కేవలం గంటల వ్యవధి లోనే పది లక్షల మంది లైక్ చేయడం విశేషం. ముఖ్యంగా సమంతకు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ ఫొటోకు వచ్చిన లైక్స్ను బట్టి అంచనా వేసుకోవచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు