ప‌వ‌న్‌ను ఏం మాయ చేశావ‌య్యా బాబు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నుంచి రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఎదుటి వాళ్ల‌ను ఒప్పించ‌డంలో చంద్ర‌బాబుకు మించినవారెవ‌రూ లేరు. తాజాగా నామినేటెడ్ ప‌ద‌వుల అంశం తెరపైకి వ‌చ్చింది. మ‌రో రెండు వారాల్లో నామినేటెడ్ ప‌ద‌వుల…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నుంచి రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఎదుటి వాళ్ల‌ను ఒప్పించ‌డంలో చంద్ర‌బాబుకు మించినవారెవ‌రూ లేరు. తాజాగా నామినేటెడ్ ప‌ద‌వుల అంశం తెరపైకి వ‌చ్చింది. మ‌రో రెండు వారాల్లో నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం జ‌ర‌గ‌నుంద‌ని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో మిత్ర‌ప‌క్షాలైన జ‌న‌సేన‌, బీజేపీకి క‌లిపి 18 నుంచి 20 శాతం ప‌ద‌వులు మాత్ర‌మే ఇవ్వ‌నున్నార‌ట‌. ఇంత వ‌ర‌కూ రెండు పార్టీల‌కు క‌లిపి 40 శాతం నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంత సీన్ లేదు, అందులో స‌గం ఇస్తే గొప్ప అని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. గ‌తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూట‌మి అధికారంలోకి వ‌స్తే నామినేటెడ్ ప‌దవులు పెద్ద సంఖ్య‌లో త‌మ‌కు వ‌స్తాయ‌ని ఆయ‌న చెబుతూ వ‌చ్చారు.

ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. రెండు పార్టీల‌కు క‌లిపి గ‌రిష్టంగా 20 శాతం నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తారంటే, జ‌న‌సేన‌కు అందులో స‌గం మాత్ర‌మే ద‌క్కే అవ‌కాశం వుంది. ఇంత త‌క్కువ సంఖ్య‌లో మిత్ర‌ప‌క్షాల‌కు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు చాణ‌క్య‌మే కార‌ణం. ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌ను జ‌న‌సేన‌కు త‌క్కువ‌గా ఇచ్చారు. ఇందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఒప్పించ‌డంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో తానిచ్చినన్ని తీసుకునేలా ప‌వ‌న్‌ను బాబు ఒప్పుకునేలా చేయ‌డం విశేషం. తాను చెప్పిన‌దానిక‌ల్లా త‌లూపేలా ప‌వ‌న్‌ను ఏం మాయ చేశావ‌య్యా అని జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

20 శాతం లోపు అంటే, ఈ లెక్క‌ను బ‌ట్టి జ‌న‌సేన‌కు ద‌క్కే ప‌ద‌వులు నామ‌మాత్ర‌మే అని చెప్పొచ్చు. మ‌రోవైపు నామినేటెడ్ ప‌ద‌వుల‌పై జ‌న‌సేన నాయ‌కులు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఇప్పుడే ద‌క్కే అవ‌కాశం లేక‌పోవ‌డంతో జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యే అవ‌కాశం వుంది. అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోనే ఈ ప‌రిస్థితి తలెత్తితే, రాబోవు రోజుల్లో ఎలా వుంటుందో చూడాలి.

7 Replies to “ప‌వ‌న్‌ను ఏం మాయ చేశావ‌య్యా బాబు!”

  1. మన అన్నకి కూడా నామినేటెడ్ పదవి ఏమైనా వొస్తది ఏమో పవన్ గారి ద్వారా ట్రై చేయమను ..

    1. మోక్ అసెంబ్లీ లో జగన్ రెడ్డే సీఎం..

      మోక్ సిబిఐ కోర్టులో జగన్ రెడ్డి “శుద్ధ పూస” గా తీర్పు..

      మోక్ హైకోర్టు లో అవినాష్ రెడ్డి “అహింసా వాది” గా తీర్పు..

  2. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం Chandrababu ని కాళ్ల వెళ్లా పడి అడుక్కు0టున్న “Leven ల0గా” గాడికి 0 nominated పదవి ivvochhugaa పవన్??

  3. ఇంకా తెలుగుదేశం పార్టీ నీ రాజకీయం గా ఎదురుకోనే పార్టీ ఉందా ? జెనసేన బలపడడమే tdp కి కావాలి పిచ్చి GA. అప్పుడు జెనసేన ప్రధాన ప్రతిపక్షం లో కి వెళుతుంది మనం నామరూపాలు లేకుండా చరిత్రలో మిగిలిపోతాం..

    .ఇదీ అర్థం అయ్యే కోర్ట్ కేసు లు వేస్తు ఫ్రస్ట్రేషన్ లో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండి

Comments are closed.