క‌డుపుకోత మిగిల్చిన ఇంట‌ర్ విద్యార్థిని!

క్ష‌ణాకావేశంలో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లి ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని జ‌మీషా ఖురేషి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.…

క్ష‌ణాకావేశంలో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లి ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని జ‌మీషా ఖురేషి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

ఇడుపుల‌పాయ‌లో ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ మంగ‌ళ‌వారం క్యాంటీన్ వ‌ద్ద పోయింది. ఆ ఫోన్‌ను ఖురేషి వ‌ద్ద అధ్యాప‌కులు గుర్తించి మంద‌లించారు. దీంతో విద్యార్థిని మ‌న‌స్తాపం చెందింది. ఈ నేప‌థ్యంలో బాత్రూంలో వాట‌ర్ పైప్‌లైన్‌కు జ‌మీషా ఖురేషి చున్నీతో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. మృతురాలు ప్ర‌కాశం జిల్లా చీరాల నివాసి.

పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లారు. మృత‌దేహాన్ని వేంప‌ల్లె ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. కుమార్తె మృతితో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. విద్యార్థులు క్ష‌ణికావేశానికి లోనై బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ఇటీవ‌ల త‌ర‌చూ పాల్ప‌డుతున్నారు.

పిల్ల‌లపై ఎంతో ప్రేమ పెంచుకుని, వారి ఉన్న‌తి కోసం క‌ల‌లు కంటున్న త‌ల్లిదండ్రుల‌కు తీవ్ర శోకాన్ని మిగ‌ల్చ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విద్యార్థులు మాన‌సికంగా ధైర్యంగా వుండేందుకు మోటివేష‌న్ క‌ల్పించాల్సిన అవ‌స‌రం వుంది.

One Reply to “క‌డుపుకోత మిగిల్చిన ఇంట‌ర్ విద్యార్థిని!”

Comments are closed.