జగన్.. వాళ్లతో మాట్లాడించండి.. వినండి!

ఏ ఒక్కరూ మిస్ కాకుండా.. ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడేలా.. విపులంగా అక్కడి పరిస్థితులను చెప్పేలాగా ప్రోత్సహించాలి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం నాడు పార్టీ జిల్లాల అధ్యక్షులతో సమావేశం అవుతున్నారు. పార్టీ పునర్నిర్మాణం దిశగా గానీ, ప్రభుత్వ వైఫల్యాల మీద పార్టీని సమర్థంగా పోరాటపథంలో నడిపించడంలో గానీ.. ఇలాంటి భేటీల అవసరం చాలా ఉంంది. అలాంటి కీలకమైన భేటీ ఎలా జరగబోతున్నది అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

అయితే ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా తన పార్టీ జిల్లాల సారథులు ఏం చెబుతున్నారో వినాలని, ముందు వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. ఆ తర్వాత తాను చెప్పదలచుకన్నది చెప్పి, అవసరమైన దిశానిర్దేశం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం దిశగా నాయకులతో వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో.. ప్రభుత్వ వైఫల్యాలను తమ పార్టీకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలో.. ఒక పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇటీవలే పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించిన జనగ్మోహన్ రెడ్డి.. ఆ కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ విధాన నిర్ణయాలకు సంబంధించి.. పీఏసీ కమిటి ఫైనల్ అథారిటీ అని కూడా ప్రకటించారు. ఆ కీలక సమావేశం నిర్వహించినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి వారందరికీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

నిజానికి పీఏసీ పేరుతో పార్టీ సీనియర్లతో నిర్వహించిన సమావేశం కంటె కూడా.. జిల్లా అధ్యక్షులతో నిర్వహించబోతున్న ఈ సమావేశం చాలా కీలకమైనది. జిల్లా అధ్యక్షులు అంటే.. పార్టీ క్షేత్రస్థాయి కేడర్ తో నిత్యం మమేకం అయి ఉండేవారుగా గుర్తించాలి. పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో వారికి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో స్పందన ఎలా ఉంటున్నదో కూడా వారికి బాగా తెలుస్తుంది.

జగన్ వేగులు, సర్వేరాయుళ్లు, ఆయన ముఖప్రీతికోసం సమాచారం మోసుకొచ్చే వాళ్లకంటె ఎక్కువ సమాచారం, క్షేత్రస్థాయి పరిణామాల గురించి పరిజ్ఞానం జిల్లా అధ్యక్షులకు ఎక్కువగా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక భిన్నమైన వ్యూహంతో ఈ భేటీ నిర్వహిస్తే పార్టీకి మేలు జరుగుతుంది.

ప్రధానంగా ఆయన అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశంలో మాట్లాడించాలి. ఏ ఒక్కరూ మిస్ కాకుండా.. ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడేలా.. విపులంగా అక్కడి పరిస్థితులను చెప్పేలాగా ప్రోత్సహించాలి. వారు చెప్పిన పరిస్థితులను, వారి సూచనలను స్పష్టంగా రికార్డు చేయించాలి. అంతే తప్ప.. తాను ఎక్కువసేపు ప్రసంగించడానికి ఆయన ముచ్చట పడకూడదు.

ఇలాంటివి మరో పది సమావేశాలు నిర్వహించినా సరే.. జగన్ ఏంమాట్లాడతారనేది.. ఏం చెప్పబోతున్నారనేది అందరికీ తెలిసిన సంగతే. ఆయన ప్రసంగంలో పెద్దగా కొత్త విషయాలు ఉండడం లేదు. స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడినా, పీఏసీ సభ్యులతో మాట్లాడినా స్క్రిప్టు ఒకటేగా ఉంటోంది.

పార్టీ బలోపేతం కావాలంటే ఆయన ప్రసంగానికి మించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై జిల్లా సారథుల నుంచి నిజాయితీగల సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారందరు ఇచ్చే ఇన్ పుట్స్ తో పార్టీ పోరాట వ్యూహాలను, భవిష్యత్ కార్యచరణను నిర్ణయించుకుంటే పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది.

13 Replies to “జగన్.. వాళ్లతో మాట్లాడించండి.. వినండి!”

  1. ఆ ఏముంటుంది దిశానిర్దేశం ఆ సజ్జల గారిని కలవండి ఆయన చెప్పిన వాటిని తూచ తప్పకుండా పాటించండి..మీ అందరి పనితనం గురించి మా భాస్కర్ అన్న నాకు రిపోర్ట్ ఇస్తాడు ..

    బాగా కష్టపడి పనిచేయండి.కళ్ళు మూసుకుంటే మూడు ఏళ్ళ మన ప్రభుత్వం రాబోతుంది.. మీ అందరికీ పదవులు ఇచ్చి మీతో పనిచెయ్యించుకుంటాను..

    అంతే కదా వెంకటరెడ్డి గారు 

  2. అన్నియ్య సందేశం..

    కళ్ళు మూసుకుంటే ఒక సంవత్సరం అయిపోయింది..ఇంకో నాలుగేళ్ళు కళ్ళు మూసుకుందాం..

    ఈ లోపల కూటమి ప్రభుత్వం మన వాళ్ళని మూసి లోపలేసినా భయ పడవద్దు..నేను కూడా వస్తా నాలుగు రోజులు అటు ఇటు గా..

    మనం మళ్ళీ అధికారం లోకి వస్తే గిస్తే అందరి బట్టలు విప్పుదాం..అప్పటి వరకు మనవి మనవే విప్పుకుందాం.. ఈ బట్టలు విప్పే కమిటీ కి రాష్ట్ర అధ్యక్షుడిగా గంట మాధవ్ , సభ్యులుగా ఆంబోతు కాంబాబు, రోజా లని నియమిస్తున్నా.

  3. అసలు ఆయనకీ విషయం పరిజ్ఞానం సూన్యం. పోనీ, వేరే వాళ్ళు ఏమన్నా చెప్పినా, పిచ్చ చూపులు చూస్తూ, టైం లేదు, It’s a lengthy question అంటూ వెళ్ళిపోతాడు.

  4. సి గ్గు అనేది లేని జన్మ అది… అవకాశం వస్తే ప్రంపంచం లోని డబ్బంతా కావాలి అంటాడు జగన్మోహన్ రెడ్డి..

  5. వైసీపీ లో మెయిన్ కరప్షన్ అంత సెంట్రలైజడ్ మద్యం ఎంత అమ్మేరో తెలియకుండా కేవలం కాష్ మాత్రమే 20 rs మద్యం 200 rs అమ్ముతారు దేనికి బిల్ లు వుండవు upi లు వాడితే ఎంత అమ్మేరో కొంతవరకైనా అవగాహన ఉంటుందని అది నిషేదించారు వాళ్ళు ఎంత అంటే అంత వైట్ చూపిస్తారు మిగిలింది బ్లాక్  డిస్టిలరీల అన్ని వాళ్లే తీసేసు కొన్నారు బయట వాళ్ళైతే ఎంత అమ్మకమో తెలిసిపోతుందని ఇక ఇసుక ఒక కంపెనీ కి మొత్తం గుత్తాధిపత్యం మైనింగ్ లెక్క జమ లేని మైనింగ్ ఇది వైసీపీ నిర్వాహకం ఇప్పుడు మల్లి కార్యకర్తలు కస్టపడి తే ఈయన గారు పాలించేస్తారు ఈసారి మళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్లి ఒకసారి అయన బొమ్మ మహిమను చూడొచ్చు

Comments are closed.