తిరుప‌తిలో ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్న టీడీపీ!

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఐదు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక‌కు టీడీపీ భ‌య‌ప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తిరుప‌తిలో వైసీపీ చేతిలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వుంది.…

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఐదు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక‌కు టీడీపీ భ‌య‌ప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తిరుప‌తిలో వైసీపీ చేతిలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వుంది. ఈ నేప‌థ్యంలో స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని క‌మిష‌న‌ర్ నార‌పురెడ్డి మౌర్య ఈ నెల 19న షెడ్యూల్ ప్ర‌క‌టించారు.

మొత్తం ఐదు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల‌ను ఎన్నుకోడానికి నెల 25, 26 తేదీల్లో నామినేష‌న్ల స్వీక‌రిస్తామ‌ని, అలాగే అక్టోబ‌ర్ 4న ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. అయితే స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేమ‌ని టీడీపీ వెన‌క‌డుగు వేయ‌డం గ‌మ‌నార్హం. కానీ ప‌రువు నిలుపుకోడానికి ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డానికి అధికార పార్టీ తెర‌లేపింది.

ఇందులో భాగంగా టీడీపీ అనుకూల కార్పొరేట‌ర్లు విచిత్ర‌మైన కార‌ణాల‌తో క‌మిష‌న‌ర్‌కు లేఖ రాశారు. వ‌చ్చే నెల 1,2, 3 తేదీల్లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తిలో ప‌ర్య‌టిస్తార‌ని, అలాగే 4వ తేదీ నుంచి 12 వ‌ర‌కు తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నార‌ని, కావున ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని క‌మిష‌న‌ర్‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ప‌వ‌న్‌తో మాట్లాడాల‌ని, అలాగే బ్ర‌హ్మోత్స‌వాల‌కు వ‌చ్చే సీఎం చంద్ర‌బాబుతో క‌ల‌వాలంటూ కార్పొరేట‌ర్ల‌లో కొంద‌రు లేఖ రాయ‌డం, అందుకు క‌మిష‌న‌ర్ త‌లొగ్గ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

కేవ‌లం 47 మంది కార్పొరేట‌ర్లు నాలుగో తేదీ ఉద‌యం 11 నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కూ పాల్గొనే ఓటింగ్‌కు అర్థంప‌ర్థం లేని కార‌ణాల‌తో ఎన్నిక‌ల‌నే వాయిదా వేయాల‌ని క‌మిష‌న‌ర్ అన‌ధికారికంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఇవాళ నామినేష‌న్ వేయ‌డానికి వైసీపీకి చెందిన కార్పొరేట‌ర్లు వెళ్ల‌గా. తీసుకునేందుకు క‌మిష‌న‌ర్ అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం.

ఇదిలా వుండ‌గా షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందే అని వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా క‌మిష‌న‌ర్‌కు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం ఓట‌మి భ‌యంతోనే స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌ను అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాయిదా వేయిస్తున్నార‌ని వైసీపీ కార్పొరేట‌ర్లు విమ‌ర్శిస్తున్నారు. క‌మిష‌న‌ర్ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

7 Replies to “తిరుప‌తిలో ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్న టీడీపీ!”

  1. ఈ ఆర్టికల్ మరీ విచిత్రం గా ఉంది.

    ఒక పక్క తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ Y.-.C.-.P చెతిలొనె ఉంది అంటున్నావ్! ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఎవమన్నా ప్రజలు నెరుగా ఎన్నుకొనె ఎన్నికా? దీనికి కూటమికి మొన్న ఎన్నికలలొ వచ్చిన భారి విజయానికి సంబందం ఎమిటి?

  2. ఆక్కడ బాబు గారు animal fat అనగానె రిపొర్ట్ మార్చారా? ఇది మరీ విచిత్రం గా ఉంది. రెపొర్ట్ లొ తారీకు ఎంత ఉంది చూడలెదా?

    .

    అయినా వారు చలా clear గా చెసిన 5 tests వాటిలొ వచ్చిన S. Values చూపించారు కదా? ఎందువల్ల animal fat కలిసింది అని నమ్ముతున్నరొ ఆ test లు, వాటి లొ వచ్చిన విలువలు చూపిస్తున్నాయి కదా?

Comments are closed.