నిమ్స్ లో నారాయణ మూర్తి.. పీపుల్ స్టార్ క్లారిటీ

నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు.. ఇలా అన్నీ తానై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆయన హాస్పిటల్ లో చేరడమే. Advertisement తనపై జరుగుతున్న…

నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు.. ఇలా అన్నీ తానై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆయన హాస్పిటల్ లో చేరడమే.

తనపై జరుగుతున్న చర్చకు నారాయణ మూర్తి ఫుల్ స్టాప్ పెట్టారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..

ఈరోజు ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆర్.నారాయణమూర్తి. అయితే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారు. అదే విషయాన్ని అక్కడున్న వాళ్లకు చెప్పారు. తను మాట్లాడలేకపోతున్నానని, ఎందుకో చాలా నీరసంగా ఉందన్నారు.

వెంటనే అప్రమత్తమైన కొంతమంది, ఆర్.నారాయణమూర్తిని నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. సాధారణ పరీక్షలు మాత్రమే నిర్వహించామని, నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ నిమ్స్ వైద్యులు ప్రకటించారు.

అయినప్పటికీ ఆయనపై చర్చ ఆగకపోవడంతో, స్వయంగా నారాయణమూర్తి ప్రకటన చేయాల్సి వచ్చింది. కొన్నాళ్ల కిందట ఆర్.నారాయణమూర్తికి బైపాస్ సర్జరీ జరిగినట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. తాజాగా ఆయన యూనివర్సిటీ అనే సినిమా తీశారు. ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాపై వర్క్ చేస్తున్నారు.