21,22,23 పబ్లిక్ లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మూడు రోజుల పాటు అభిమానులకు దగ్గరగా వుండబోతున్నారు. 21 రాత్రి అభిమానులు నిర్వహించే బర్త్ డే సెలబ్రేషన్లలో వుంటారు. 22 తాను టాలీవుడ్ జనాలకు ఇచ్చే పార్టీలో వుంటారు. మూడోది తన…

మెగాస్టార్ చిరంజీవి మూడు రోజుల పాటు అభిమానులకు దగ్గరగా వుండబోతున్నారు. 21 రాత్రి అభిమానులు నిర్వహించే బర్త్ డే సెలబ్రేషన్లలో వుంటారు. 22 తాను టాలీవుడ్ జనాలకు ఇచ్చే పార్టీలో వుంటారు. మూడోది తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ లేటెస్ట్ మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అడియో ఫంక్షన్లో వుంటారు.

ఇటీవలి కాలంలో చిరు అడియో ఫంక్షన్ కు వచ్చి చాలా కాలం అయింది. సాయి ధరమ్ తేజ మూడో సినిమా ఇది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. అయితే ఈ విషయం ముందుగా ప్రకటించడం లేదు. కానీ సాయి ధరమ్ తేజ కోరిన మేరకు చిరంజీవి అడియో ఫంక్షన్ కు రావడానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎక్కువ భాగం యుఎస్ లో చిత్రీకరించారు.

చిరంజీవి బావగారూ బాగున్నారా, మొగుడుకావాలి టైపు షేడ్స్ వున్న కథ ఇది అని టాలీవుడ్ గుసగుస. పైగా చిరంజీవి పాట ఒకటి రీమిక్స్ చేసారు కూడా.