గంగ పంచాయతీ మళ్లీ మొదటికి

గంగ సినిమాకు సంబంధించి ఫైనాన్స్ పంచాయతీ తెగడం లేదు. రాత్రి పదిగంటల వేళకు అంతా అయింది..రేపు సినిమా వదిలేద్దాం అనుకున్నారు. కానీ మళ్లీ అంతలోనే మొదటికి వచ్చింది. రాత్రి పన్నెండు గంటల దాటే వరకు…

గంగ సినిమాకు సంబంధించి ఫైనాన్స్ పంచాయతీ తెగడం లేదు. రాత్రి పదిగంటల వేళకు అంతా అయింది..రేపు సినిమా వదిలేద్దాం అనుకున్నారు. కానీ మళ్లీ అంతలోనే మొదటికి వచ్చింది. రాత్రి పన్నెండు గంటల దాటే వరకు ఆ పంచాయతీ అలా సాగుతూనే వుంది. 

ఆఖరికి అక్కడ ఆపి ఆదివారం డిస్కషన్లు మళ్లీ మొదలెట్టాలని డిసైడ్ అయ్యారు. అంటే ఇక ఆదివారం సినిమా లేనట్లే. సినిమాను మల్టీ డైమన్షన్ తనకు రావాల్సిన బాకీలకు నైజాం ఏరియా తీసుకుంటుందని వార్తలు వినవచ్చాయి. కానీ మళ్లీ ఏమయిందో కథ మొదటికి వచ్చింది. ఆదివారం దాటి పోయింది కాబట్టి ఇక 24నే వేయాలి అనుకుంటున్నారు. 

కానీ ఇప్పుడు ఉరిమి ఉరిమి మీద పడినట్లు, దోచేయ్ సినిమాకు ట్రబుల్ ఇచ్చేటట్లువుంది. ఎందుకంటే గంగ ఊర మాస్…దోచేయ్ వీర క్లాస్. కానీ దోచేయ్ కు మరో మార్గం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే డేట్ ప్రకటించేసారు..వెనక ఉత్తమ విలన్ రెడీగా వున్నాడు. నిజానికి సత్యమూర్తితో ట్రబుల్ ఎందుకని 17 నుంచి వారం వెనక్కు వెళ్లారు. అలా వెళ్లకుండా వుండి వుంటే అన్ని విధాలా బాగుండేది.