16 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తారా?

మొన్నటికిమొన్న చిరంజీవి-త్రిష కలిశారు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మరో కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. అదే ప్రభాస్-త్రిష. Advertisement సందీప్ రెడ్డి…

మొన్నటికిమొన్న చిరంజీవి-త్రిష కలిశారు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మరో కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. అదే ప్రభాస్-త్రిష.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ గా త్రిషను ట్రై చేస్తున్నారట.

ప్రభాస్-త్రిష కలిసి చివరిసారిగా బుజ్జిగాడు సినిమా చేశారు. అంతకంటే ముందు వీళ్లిద్దరి కాంబోలో వర్షం, పౌర్ణమి సినిమాలొచ్చాయి. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్-త్రిష కాంబినేషన్ కలిసేలా ఉంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో త్రిష హవా నడుస్తోంది. ఇన్నేళ్లయినా ఆమెకు అక్కడ ఆదరణ తగ్గలేదు. అందుకే విజయ్, అజిత్, చిరంజీవి, కమల్ హాసన్ లాంటి హీరోలు ఆమెను మరోసారి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరేలా ఉన్నాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. కెరీర్ పరంగా ఇప్పుడు కొత్త దారుల్లో వెళ్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె మలయాళం సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, తొలిసారి ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది.

7 Replies to “16 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తారా?”

Comments are closed.