మీడియం సినిమాలపైనే ‘మైత్రీ’

భారీ సినిమాలతో సర్రున టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది మైత్రీమూవీస్. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లతో భారీ సినిమాలు, బ్లాక్ బస్టర్లు అందించింది. అంతేకాదు, ప్రభాస్, పవన్, బన్నీ, త్రివిక్రమ్, బోయపాటి, సుకుమార్ ఇలా…

భారీ సినిమాలతో సర్రున టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది మైత్రీమూవీస్. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లతో భారీ సినిమాలు, బ్లాక్ బస్టర్లు అందించింది. అంతేకాదు, ప్రభాస్, పవన్, బన్నీ, త్రివిక్రమ్, బోయపాటి, సుకుమార్ ఇలా హేమా హేమీలకు అడ్వాన్స్ లు అందించి భారీ ప్రణాళికలు రెడీ చేసుకుంది.

కానీ ఇప్పుడు ప్లాన్ లు అన్నీ తారుమారైపోయాయి. త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చే మూడ్ లో వున్నారని టాక్. బోయపాటి నుంచి అడ్వాన్స్ వెనక్కు తీసుకునే మూడ్ లో మైత్రీ వుంది. సుకుమార్ సినిమా ఎప్పుడు ఎవరితో వుంటుందో తెలియదు. పవన్, ప్రభాస్ ఎప్పుడు సినిమాలు చేస్తారో అసలే తెలియదు. మైత్రీ మిత్రుడు కొరటాల శివ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేదిలేదు.

ఇలాంటి నేపథ్యంలో మైత్రీ అధినేతలు మీడియం సినిమాలే బెటర్ అన్న ఐడియాకు వచ్చేసినట్లు తెలుస్తోంది. నానితో, విజయ్ దేవరకొండతో కాస్త మంచి సబ్జెక్ట్ తోనే సినిమాలు రెడీ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్ తో చిన్న సినిమా ఒకటి మొదలైంది. ఇలా ఇంక మంచి స్క్రిప్ట్ ఎవరు తెస్తే వారితో, ఎవరు దొరికితే ఆ హీరోలతో మీడియం సినిమాలు చేయాలనే ఆలోచనలు మైత్రీ నిర్మాతలు చేస్తున్నట్లు బోగట్టా.

ఈ మేరకు మంచి స్క్రిప్ట్ ల కోసం అన్వేషిస్తున్నారు. వెంకీ అట్లూరి ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. సందీప్ వంగా కూడా ఓ సినిమా రెడీ చేయాల్సి వుంది.

జగన్ గేమ్ తో టీడీపీకి చెక్?