దిల్ రాజు చేతికి 118

కళ్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 118. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయకులుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన…

కళ్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 118. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయకులుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన చేతుల్లోకి తీసుకున్నారు. సినిమా మార్కెటింగ్ స్టార్ట్ కావడంతో, నైజాం ఏరియా విషయంలో నిర్మాత మహేష్ కోనేరు కోరిక మేరకు దిల్ రాజు, శిరీష్ కలిసి సినిమా చూసినట్లు బోగట్టా.

సినిమా చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు నైజాం ఏరియాతో పాటు ఆంధ్ర ఏరియా హక్కులు కూడా తీసేసుకున్నారు. అప్పటికే సీడెడ్ హక్కులు అమ్మేసారు. టోటల్, ఆంధ్ర, నైజాం, సీడెడ్ కలిసి సినిమాను ఏడు కోట్లకు పైగా మార్కెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ రూపంలో నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది ఈ సినిమాకు.

ఇంకా శాటిలైట్, ఓవర్ సీస్, కర్ణాటక హక్కులు విక్రయించాల్సి వుంది. మార్చి ఒకటిన ఈ సినిమా విడుదల కాబోతోంది.