‘ఆగడు’ దెబ్బకి టోటల్‌ ఛేంజ్‌

‘ఆగడు’ సినిమాకి ముందు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్న శ్రీను వైట్ల ఊహించని డిజాస్టర్‌తో బాగా డిజప్పాయింట్‌ అయ్యాడు. ఆగడు మొదలు పెట్టడానికి ముందు తన టెంప్లేట్‌ని మార్చేసి కొత్త రకం సినిమా చేద్దామని అనుకుని…

‘ఆగడు’ సినిమాకి ముందు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్న శ్రీను వైట్ల ఊహించని డిజాస్టర్‌తో బాగా డిజప్పాయింట్‌ అయ్యాడు. ఆగడు మొదలు పెట్టడానికి ముందు తన టెంప్లేట్‌ని మార్చేసి కొత్త రకం సినిమా చేద్దామని అనుకుని కూడా రిస్కు తీసుకోవడం ఇష్టం లేక మళ్లీ అదే రిపీట్‌ చేసాడు. అది బ్యాక్‌ఫైర్‌ అవడంతో శ్రీను వైట్ల ఇక మళ్లీ తన రొటీన్‌ స్క్రీన్‌ప్లేని మార్చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 

రామ్‌ చరణ్‌తో శ్రీను వైట్ల తీస్తోన్న ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ చిత్రం అతని గత చిత్రాలకి భిన్నంగా ఉంటుందట. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ అని, చరణ్‌ ఇందులో బైక్‌ రేసర్‌గా కనిపిస్తాడని తెలిసింది. అలా అని కామెడీ లేకుండా ఉండదు. కామెడీ ఉన్నా కానీ శ్రీను వైట్ల అలవాటు పడిన కామెడీ ట్రాక్‌ కాకుండా ఇందులో డిఫరెంట్‌గా ఉంటుందట. 

ఇంకా హీరోయిన్‌ని అధికారికంగా ఖరారు చేయలేదు కానీ సమంత హీరోయిన్‌గా నటిస్తుందని వినిపిస్తోంది. ఇంతవరకు చరణ్‌తో సమంత నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్‌ ఫ్రెష్‌గా ఉంటుందని అనుకుంటున్నారు.