క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు!

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు తెర‌పైకి వ‌చ్చారు. మాజీ ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డిని వైఎస్ జ‌గ‌న్ నియ‌మించారు. వ‌రుస‌గా రెండు సార్లు క‌మ‌లాపురం నుంచి జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి…

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు తెర‌పైకి వ‌చ్చారు. మాజీ ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డిని వైఎస్ జ‌గ‌న్ నియ‌మించారు. వ‌రుస‌గా రెండు సార్లు క‌మ‌లాపురం నుంచి జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కూట‌మి సునామీలో జ‌గ‌న్ మేన‌మామ కొట్టుకుపోయారు.

క‌మలాపురం నుంచి టీడీపీ త‌ర‌పున యువ నాయ‌కుడు పుత్తా చైత‌న్య‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వైసీపీ టికెట్‌ను ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు, చింత‌కొమ్మ‌దిన్నె జెడ్పీటీసీ స‌భ్యుడు న‌రేన్ ఆశించారు. అయితే తానింకా యాక్టీవ్‌గా ఉన్నాన‌ని ర‌విరెడ్డి బ‌రి నుంచి త‌ప్పుకోడానికి నిరాక‌రించారు.

అయితే వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. జ‌గ‌న్ త‌న మేన‌మామ‌ను వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా తాజాగా నియ‌మించారు. వ‌రుస‌కు బామ్మ‌ర్ది అయ్యే న‌రేన్‌కు క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల్ని జ‌గ‌న్ అప్ప‌గించ‌డం విశేషం.

రానున్న రోజుల్లో క‌మ‌లాపురం నుంచి న‌రేన్ పోటీ ఖాయ‌మైన‌ట్టే. ఎప్ప‌టి నుంచో సీటు ఆశిస్తున్న న‌రేన్ ఉత్సాహంగా ప‌ని చేస్తార‌ని జ‌గ‌న్ ఆశిస్తున్నారు. బావ న‌మ్మ‌కాన్ని న‌రేన్ ఎంత వ‌ర‌కు నిలుపుకుంటారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

6 Replies to “క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు!”

  1. తప్పు చేసావ్ రామంజి బామ్మర్ది…నీకు MLA టికెట్ కావాలంటే నీ తండ్రి నీ బాత్రూం కి పంపించాల్సింది.. నువ్వు ఇంకోసారి అలాంటి పొరపాటు చెయ్యవని ఆశిస్తూ.. ల0గా Leven జెగ్గుల్

Comments are closed.