ఎందుకిలా చేస్తున్నారు.. స్టార్ డైరక్టర్ ఆవేదన

సూపర్ స్టార్ రజనీకాంత్, బ్లాక్ బస్టర్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తొలిసారి కలిశారు. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Advertisement ఆ అంచనాలకు తగ్గట్టే భారీ తారాగాణాన్ని తన సినిమాలోకి…

సూపర్ స్టార్ రజనీకాంత్, బ్లాక్ బస్టర్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తొలిసారి కలిశారు. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టే భారీ తారాగాణాన్ని తన సినిమాలోకి తీసుకున్నాడు లోకేష్. మరీ ముఖ్యంగా విలన్ పాత్ర కోసం టాలీవుడ్ అగ్రహీరో నాగార్జునను ఎంపిక చేశాడు.

విశాఖలో జరిగిన షెడ్యూల్ లో నాగార్జున జాయిన్ అయ్యాడు. తొలి షెడ్యూల్ లోనే అతడిపై యాక్షన్ సీన్ తీశాడు లోకేష్ కనగరాజ్. కానీ అందర్నీ షాక్ కు గురిచేస్తూ, ఆ వీడియో లీక్ అయింది.

కూలీ సినిమాలో నాగార్జున యాక్షన్ సీన్ ను ఎవరో రహస్యంగా షూట్ చేసి లీక్ చేశారు. వైజాగ్ లో ఔట్ డోర్ షూటింగ్, పైగా నాగార్జునపై సీన్. దీంతో ఆటోమేటిగ్గా వీడియో వైరల్ అయింది. వీడియోలో నాగ్ చేతిలో సుత్తి పట్టుకొని ఓ వ్యక్తిని చంపుతున్న సీన్ అది. లోకేష్ స్టయిల్ లోనే భయంకరంగా ఉంది ఆ సీన్. పైగా నాగార్జున వాయిస్ కూడా వినిపిస్తోంది.

ఊహించని విధంగా కూలీ సీన్ లీక్ అవ్వడంతో లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఒకే ఒక్క రికార్డింగ్ కారణంగా యూనిట్ చేసిన 2 నెలల కష్టం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని, సినిమా ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ ను దెబ్బతీయొద్దని కోరాడు.

కూలీ సినిమా వైజాగ్ షెడ్యూల్ ముగిసింది. ఇందులో హీరోయిన్ శృతిహాసన్ కూడా పాల్గొంది. సినిమాలో రజనీకాంత్, నాగ్ తో పాటు.. ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి సీనియర్లు నటిస్తున్నారు.

One Reply to “ఎందుకిలా చేస్తున్నారు.. స్టార్ డైరక్టర్ ఆవేదన”

Comments are closed.