లంచగొండి భార్యను పట్టించిన భర్త

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ మహిళా ఉద్యోగి లంచాలకు అలవాటుపడింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. దీంతో భర్తే ఆమెను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించిన ఉదంతం ఇది. Advertisement హైదరాబాద్…

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ మహిళా ఉద్యోగి లంచాలకు అలవాటుపడింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. దీంతో భర్తే ఆమెను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించిన ఉదంతం ఇది.

హైదరాబాద్ శివార్లలోని మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో డిఈఈగా పనిచేస్తోంది దివ్యజ్యోతి. ఈమె తెగ లంచాలకు అలవాటుపడిందని ఆరోపిస్తున్నాడు భర్త శ్రీపాద్. లక్షల్లో డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచిపెడుతోందంటూ వీడియోలు బయటపెట్టాడు శ్రీపాద్.

బీరువాలో, పరుపు కింద, దేవుడి గదిలో, కిచెన్ లో, పూల కుండీల వెనక.. ఇలా చాలా చోట్ల న్యూస్ పేపర్లలో చుట్టిన నోట్ల కట్టల వీడియోల్ని భర్త శ్రీపాద్ బయటపెట్టాడు. వీడియోలు బయటపెట్టడమే కాదు, స్వయంగా ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి, భార్యను పట్టించాడు.

భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దివ్య జ్యోతికి అతడు విడాకులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్రమంగా సంపాదించిన సొమ్ము వద్దంటూ ఎన్నోసార్లు భార్యను వారించాడట శ్రీపాద్. అయినప్పటికీ ఆమె వినకపోగా, భర్తతో గొడవలు పెట్టుకుందట. అందుకే విడాకులిచ్చినట్టు చెప్పుకొస్తున్నాడు.

6 Replies to “లంచగొండి భార్యను పట్టించిన భర్త”

Comments are closed.