నా కూతురు సినిమా ఆగిపోయింది

రాజశేఖర్ పెద్దకూతురు శివానీని గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. ఆమె ఎంట్రీకి సంబంధించి అప్పట్లో భారీగా ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు. అలా గ్రాండ్ గా ప్రారంభమైన 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయింది.…

రాజశేఖర్ పెద్దకూతురు శివానీని గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. ఆమె ఎంట్రీకి సంబంధించి అప్పట్లో భారీగా ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు. అలా గ్రాండ్ గా ప్రారంభమైన 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయింది. సగం షూట్ చేసిన తర్వాత అవుట్ పుట్ బాగాలేదని సినిమా ఆపేశారు. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే బయటపెట్టింది. ఇప్పుడీ మేటర్ ను హీరో రాజశేఖర్ కూడా నిర్థారించాడు.

తన పెద్దకూతురు హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఆగిపోయిందనే విషయాన్ని రాజశేఖర్ స్పష్టంచేశాడు. కల్కి సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన రాజశేఖర్, శివాని సినిమా ఆగిపోయిందని, అది మళ్లీ సెట్స్ పైకి వచ్చేది అనుమానమే అనే విధంగా మాట్లాడాడు. పెద్దమ్మాయిని హీరోయిన్ గా చేద్దామనుకుంటే, తనకంటే ముందు చిన్నమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని చెప్పుకొచ్చాడు.

మరోవైపు అక్కినేని హీరోలు కలిసి చేసినట్టుగా తమకు కూడా మనం లాంటి ఓ సినిమా చేయాలని ఉందని రాజశేఖర్ ప్రకటించాడు. ఆ దిశగా తామంతా ఆలోచిస్తున్నామని, కాకపోతే దానికి ఇంకా చాలా టైమ్ పడుతుందంటున్నాడు ఈ కల్కి హీరో.

“కూతుళ్లతో కలిసి నటించాలని ఉంది. కానీ ఇప్పుడే కాదు. పెద్దమ్మాయి హీరోయిన్ గా ఎదగాలి. చిన్నమ్మాయి కూడా 2-3 సినిమాలు చేయాలి. అప్పుడు మనం లాంటి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి.కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది.”

బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడనే వార్తపై కూడా రాజశేఖర్ స్పందించాడు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన లేదన్నాడు. అయితే కథ బాగుంటే.. విలన్, క్యారెక్టర్ రోల్స్ లో కూడా కనిపించడానికి సిద్ధమని ప్రకటించాడు.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి