Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిధరమ్ కే ఫిక్సయిన వినాయక్

సాయిధరమ్ కే ఫిక్సయిన వినాయక్

మొత్తానికి తన తరువాతి సినిమా మీద దర్శకుడు వివి వినాయక్ ఫిక్సయిపోయారు. హీరో సాయిధరమ్ తేజ తోనే చేయాలని డిసైడ్ అయిపోయారు. నిర్మాతగా సి కళ్యాణ్ వ్యవహరిస్తారు. ఆయన ఇప్పటికే బాలయ్య-కేఎస్ రవికుమార్ తో ఓ ప్రాజెక్టు ప్రకటించారు. ఇది రెండో ప్రాజెక్టు. రెండూ సమాంతరంగా రెడీ చేస్తారు.

ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత సరైన సినిమా కోసం వినాయక్ వేచి చూసారు. కానీ ఏ హీరో కూడా ఖాళీ లేరు. పెద్ద హీరోల డేట్లు దొరకాలంటే కనీసం ఏడాది అయినా పట్టేలా వుంది. ఆలోగా ఓ సినిమా చేసేయచ్చు.

ఓ సినిమా అంటే వినాయక్ లాంటి డైరక్టర్ కు పది కోట్లకు పైనే ఆదాయం. అందుకే అంతటి ఆదాయం వదులుకోవడం ఎందుకని, ఆయన సాయిధరమ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఆకుల శివ అందించిన కథను ఈ సినిమా కోసం లాక్ చేసారు. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?