దాసరి..అనుకోని అతిథి?

సన్నాఫ్ సత్యమూర్తి అడియో ఫంక్షన్ కు దర్శకుడు దాసరి నారాయణ రావు అనుకోని అతిథిగా వచ్చారా? ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం అదే నిజమని తెలుస్తోంది. ఏ అతిథి లేకుండా కేవలం సినిమాకు…

సన్నాఫ్ సత్యమూర్తి అడియో ఫంక్షన్ కు దర్శకుడు దాసరి నారాయణ రావు అనుకోని అతిథిగా వచ్చారా? ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం అదే నిజమని తెలుస్తోంది. ఏ అతిథి లేకుండా కేవలం సినిమాకు సంబంధించిన వారితోనే ఫంక్షన్ చేయాలన్నది దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ సంకల్పం. అత్తారింటికి దారేది సినిమా ఫంక్షన్ అలాగే చేసారు కూడా.

అయితే సన్నాఫ్ సత్యమూర్తి నిర్మాతలకు దర్శకుడు దాసరికి మనీ లావాదేవీలు వున్నాయట. దాంతో వారు మొహమాటానికి దాసరిని పిలవకతప్పలేదు. అప్పటికీ దాసరి ముందుగా అభయం ఇచ్చారట. తాను పెద్దగా మాట్లాడనని, రెండు నిమషాలు మాత్రమే ప్రసంగిస్తానని అన్నారట. అయితే ఇప్పుడు అదే కాంట్రావర్సీగా మారుతోంది. 

దాసరి పవన్ ను, బన్నీని గాల్లోకి ఎత్తడం, రామలింగయ్య ఫ్యామిలీ బంధువుగా వచ్చానని అనడం, మెగాస్టార్ గురించి మాట వరసకైనా ప్రసావించకపోవడం, మెగాఫ్యాన్స్ ను మండిస్తున్నాయి. పైగా కొద్ది రోజుల క్రితమే దాసరి అన్యాపదేశంగా రామ్ చరణ్ పై విమర్శలు చేసారు. అలాంటి వ్యక్తిని పిలిచి, మరోసారి ఇలా మాట్లాడించడం కాస్త ఇబ్బందికరమైన వ్యవహారంగా తయారైంది.

పైగా సోలోగా ఫంక్షన్ చేస్తామని ఎవర్నీ పిలవలేదు. రామ్ చరణ్, పవన్, మెగాస్టార్, ఇంకా ఆ ఫ్యామిలీకి చెందినవారిని ఎవరినీ పిలవలేదు. కానీ దాసరిని పిలవడం కూడా కాస్త తేడాగానే కనిపిస్తోంది,.