తెలుగులోకి మాయావన్

మొత్తానికి సందీప్ కిషన్ మెలమెల్లగా తెలుగు-తమిళ నటుడు అయిపోతున్నాడు. అతని సినిమాలు అన్నీ తెలుగు-తమిళ భాషల్లోనే తయారవుతున్నాయి.త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్ ని సొంతం చేసుకుంటున్నారు కాని తెలుగు హీరోలు చాలా త‌క్కువ‌గా ప్రయ‌త్నాలు…

మొత్తానికి సందీప్ కిషన్ మెలమెల్లగా తెలుగు-తమిళ నటుడు అయిపోతున్నాడు. అతని సినిమాలు అన్నీ తెలుగు-తమిళ భాషల్లోనే తయారవుతున్నాయి.త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్ ని సొంతం చేసుకుంటున్నారు కాని తెలుగు హీరోలు చాలా త‌క్కువ‌గా ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

సందీప్ కిష‌న్ మాత్రం త‌మిళ మార్కెట్ మెలమెల్లగా పెంచుకుంటున్నాడు. ఇంకా కాస్త క్లారిటీగా చెప్పుకోవాలంటే, ఇక్కడ కన్నా అక్కడ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ఏడాది చేసిన వాటిలో ‘నగరం’ తమిళంలో మంచి హిట్ అయింది. ‘కేరాఫ్ సూర్య’ కు తమిళంలో మంచి ప్రశంశ‌లు వ‌చ్చాయి.

సందీప్ కిష‌న్ నటించిన మరో సినిమా ఇప్పుడు అక్కడ థియేటర్లలోకి వచ్చింది. అదే.. మాయవన్. మొదటి షో పడుతూనే దీనికి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. సి.వి.కుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం మాయావ‌న్‌. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు.

ఈ థ్రిల్లర్ మూవీ ఈ వార‌మే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి ముందు ప్రివ్యూలు వేయగా.. మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో కూడా రెస్పాన్స్ బాగుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి ‘ప్రాజెక్ట్ జడ్’ పేరుతో త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

తెలుగు కాపీని ముందుగానే ప్రాజెక్ట్ జెడ్ పేరుతో సందీప్ కిషన్ రెడీ చేయించేసారు. ఈ ప్రాజెక్టును ఓ నిర్మాత తీసుకుని విడుదలకు సిద్దం చేస్తున్నారు.