Advertisement

Advertisement


Home > Movies - Movie News

అవి పుకార్లు మాత్రమే.. ఖండించిన ప్రభాస్ టీమ్

అవి పుకార్లు మాత్రమే.. ఖండించిన ప్రభాస్ టీమ్

ఈ నెల్లోనే సెట్స్ పైకి రాబోతోంది సలార్-2 సినిమా. అంతలోనే ఈ మూవీపై కొన్ని పుకార్లు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఒకటి రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమాను స్టార్ట్ చేయాల్సిందిగా ప్రశాంత్ నీల్ ను ఎన్టీఆర్ కోరినట్టు ప్రచారం జరిగింది.

దేవర సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, దేవర-2 షూట్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను కూడా ఎన్టీఆర్ పూర్తిచేసే ప్లాన్ లో ఉన్నాడని, ఈ మేరకు నీల్ కు సమాచారం ఇచ్చాడనేది ఆ పుకార్ల సారాంశం. అదే కనుక జరిగితే ప్రభాస్ తో చేయాల్సిన సలార్-2 సినిమా పెండింగ్ లో పడుతుంది.

దీంతో సలార్-2 ఇప్పట్లో రాదంటూ కథనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ పుకార్లను ప్రభాస్ టీమ్ ఖండించింది. ఈ నెల్లోనే సలార్-2 సెట్స్ పైకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది.

సలార్-2 సెట్స్ పైకి వచ్చినా ప్రభాస్ ఇప్పట్లో లొకేషన్ లోకి రాడనే పుకారు కూడా ఉంది. దీనిపై కూడా ప్రభాస్ టీమ్ స్పందించింది. సలార్-2 కోసం ప్రభాస్ బల్క్ గా డేట్స్ ఇచ్చాడట. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాజా సాబ్ సినిమా కంటే కూడా, సలార్-2కే ప్రభాస్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు టీమ్ వెల్లడించింది.

దీంతో సలార్-2పై 2 రోజులుగా నడుస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఈ సినిమాకు పృధ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా ఇప్పటికే డేట్స్ కేటాయించారు. ప్రభాస్ కూడా సెట్స్ పైకి వస్తే.. సలార్-2 షూట్ పరుగులు పెట్టడం ఖాయం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?