చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్పై జగన్ వివరణ ఇచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రాన్ని కూటమి ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్ట్ను అడ్డం పెట్టుకుని భూములను జగన్ లాక్కుంటారని పెద్ద ఎత్తున ప్రజలను చంద్రబాబు, పవన్ భయాందోళనకు గురి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటో జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు నువ్వు మనిషివేనా అని జగన్ నిలదీశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గొప్ప సంస్కరణగా ఆయన అభివర్ణించారు. భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమని జగన్ వివరించారు.
వందేళ్ల క్రితం బ్రిటీష్ పాలకుల హయాంలో భూసర్వే జరిగిందన్నారు. ఆ తర్వాత సర్వే జరగకపోవడం, భూములు సబ్ డివిజన్ కాకపోవడంతో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. భూసమస్యలపై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఆయన వివరించారు.
భూములపై ఇన్స్యూరెన్స్ కూడా చేయాలనేదే తమ లక్ష్యంగా జగన్ వివరించారు. అయితే ఈ చట్టం అమలు కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందన్నారు. భూములన్నీ సర్వే చేసిన తర్వాతే చట్టం అమలవుతుందన్నారు.
తాను భూములు ఇచ్చేవాడినే తప్ప, తీసుకునే వాడిని కాదని అనుమానాలకు తెరదించారు. రికార్డులన్నీ అప్డేట్ చేసి హక్కు పత్రాల్ని పదిలంగా భూయజమానులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జగన్ వివరణ ఇచ్చారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు