చెర్రీపై శ్రీనువైట్ల చూపు!

పేరుకు త‌గ్గట్టుగానే మ‌హేష్ సినిమా ఎక్కడా ఆగ‌కుండా దూసుకెళుతోంది. ఈ వేగం చూస్తుంటే జూన్‌లోపు 'ఆగ‌డు' సినిమాని ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేలా క‌నిపిస్తోంది.  అందుకే… శ్రీనువైట్ల త‌న తదుప‌రి సినిమా గురించి క‌స‌ర‌త్తులు చేయ‌డం…

పేరుకు త‌గ్గట్టుగానే మ‌హేష్ సినిమా ఎక్కడా ఆగ‌కుండా దూసుకెళుతోంది. ఈ వేగం చూస్తుంటే జూన్‌లోపు 'ఆగ‌డు' సినిమాని ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేలా క‌నిపిస్తోంది.  అందుకే… శ్రీనువైట్ల త‌న తదుప‌రి సినిమా గురించి క‌స‌ర‌త్తులు చేయ‌డం మొద‌లుపెట్టాడు. 

మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయ‌న ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నట్టు స‌మాచారం. ఆ మేర‌కు చ‌ర‌ణ్‌కి క‌థ కూడా వినిపించాడ‌ట‌. అయితే… ప్రస్తుతం చేస్తున్న కృష్ణవంశీ సినిమా పూర్తి చేశాకే పూర్తిస్థాయిలో క‌థ విని అభిప్రాయం వెల్లడిస్తాన‌ని చ‌ర‌ణ్ చెప్పాడ‌ట‌. 

అయితే… చ‌ర‌ణ్‌కి కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌లు కూడా ఓ క‌థ వినిపించిన‌ట్టు స‌మాచారం. ఆ క‌థ చ‌ర‌ణ్‌కి బాగా న‌చ్చిందట‌. ఇలాంటి క‌థ‌కు శ్రీనువైట్లలాంటి ద‌ర్శకుడు తోడైతే బాగుంటుంద‌ని చెర్రీ అభిప్రాయప‌డుతున్నాడ‌ట‌. అందుకే కృష్ణవంశీతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక కోన‌, గోపీమోహ‌న్‌, శ్రీనువైట్లని క‌లిపి సినిమా చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నట్టు స‌మాచారం.

మ‌రి ద‌ర్శకుడితో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న ద‌ర్శక‌ద్వయంతో శ్రీనువైట్ల మ‌ళ్లీ క‌లుస్తాడా?  వారి క‌థ‌తో సినిమా తీయాడానికి ఒప్పుకొంటాడా అన్నది చూడాలి.