ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగ

సాధారణంగా ఏ సినిమాకైనా వారం రోజులు టైమ్ ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత మరో శుక్రవారం వచ్చేంత వరకు ఆ సినిమాకు స్కోప్ ఉంటుంది. కానీ కమిటీ కుర్రోళ్లకు ఆ అవకాశం లేదు.…

సాధారణంగా ఏ సినిమాకైనా వారం రోజులు టైమ్ ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత మరో శుక్రవారం వచ్చేంత వరకు ఆ సినిమాకు స్కోప్ ఉంటుంది. కానీ కమిటీ కుర్రోళ్లకు ఆ అవకాశం లేదు.

ఈ సినిమాకు చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి లాంటి ప్రముఖులు పబ్లిసిటీ చేశారు. బ్రేక్ ఈవెన్ అయిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే శుక్రవారం వరకు ఈ సినిమా సోలోగా నడిచే పరిస్థితి లేదు.

ఆగస్ట్ 15 సందర్భంగా ఈవారం సినిమాలన్నీ రేపే రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, ప్రీమియర్స్ రూపంలో ఈరోజు సాయంత్రం నుంచే థియేటర్లలోకి వస్తోంది. ఇది కమిటీ కుర్రోళ్లకు కచ్చితంగా ఇబ్బందికరం.

నిహారిక కొణెదల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు రేపట్నుంచి భారీగా థియేటర్లు తగ్గబోతున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు ఎక్కువగా స్క్రీన్స్ దక్కగా.. డబ్బింగ్ సినిమా తంగలాన్ కు, ఆయ్ సినిమాకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దొరికాయి.

7 Replies to “ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగ”

Comments are closed.