ఎక్స్ క్లూజివ్..త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ

దర్శకుడు త్రివిక్రమ్ కు మన పురాణాల మీద మాంచి పట్టు వుంది. తనదైన ఆలోచనా విధానం వుంది. అందుకే ఆయన ఓ మాంచి పాన్ ఇండియా సినిమా తీయాలంటే అదే సరైన జానర్ అని…

దర్శకుడు త్రివిక్రమ్ కు మన పురాణాల మీద మాంచి పట్టు వుంది. తనదైన ఆలోచనా విధానం వుంది. అందుకే ఆయన ఓ మాంచి పాన్ ఇండియా సినిమా తీయాలంటే అదే సరైన జానర్ అని డిసైడ్ అయ్యారు. ఇప్పట్లో కాదు కానీ మరో ఏడాదిన్నర తరువాత అయినా అలాంటి సినిమా చేయాలని ఇప్పటి నుంచీ ప్లాన్ చేసుకుంటున్నారు. దీని వ్యవహారం అంతా ఇలా వుంది.

దర్శకుడు గుణశేఖర్ నిర్మాత సురేష్ బాబుతో కలిసి హిరణ్యకశిప సినిమా చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ తయారు చేసారు. చాన్నాళ్లు వర్క్ చేసారు. కానీ అది సరిగ్గా రాలేదని సురేష్ బాబు..రానా భావించారు. ఆ విధంగా ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది. భీమ్లా నాయక్ టైమ్ లో రానా-త్రివిక్రమ్ ల నడుమ ఈ విషయం చర్చకు వచ్చింది. త్రివిక్రమ్ అప్పట్లో కాస్త లీజర్ గా వుండి ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. కొంత వర్క్ చేసారు. అది రానా కు నచ్చేసింది.

దాంతో గుణశేఖర్ దగ్గర ఇబ్బందులు రాకుండా అన్ని సెటిల్ మెంట్లు చేసుకుని, హారిక హాసిని తరుపున టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించేసారు. అంటే త్రివిక్రమ్-రానా-హారికహాసిని కాంబినేషన్ హిరణ్య కశిప సినిమా తెరకెక్కుతుందట. చాలా భారీగా, విజవల్ వండర్ గా వుంటుందట. గుణశేఖర్ స్క్రిప్ట్ పూర్తిగా అలనాటి భక్త ప్రహ్లాద అడుగుజాడల్లో నడిస్తే, త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తిగా భిన్నంగా వుంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. దాని తరువాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ తరువాత రానా సినిమా వుంటుందని తెలుస్తోంది. రానా కూడా అప్పటి వరకు మరే సినిమా చేసే ఆలోచనలో లేరని బోగట్టా.