తేజు సినిమాకు మెగా క్లియరెన్స్

సాయితేజ్ చేయబోయే తరువాత సినిమాకు రంగం సిద్దమైంది. చిత్రలహరి దగ్గర నుంచి సాయి(ధరమ్)తేజ్ ఓ కొత్త పద్దతి పెట్టుకున్నారు. తను చేయబోయే సినిమా ఏదయినా కథను మెగామామయ్య చిరంజీవికి చెప్పి, ఓకె చేయించుకోవడం. Advertisement…

సాయితేజ్ చేయబోయే తరువాత సినిమాకు రంగం సిద్దమైంది. చిత్రలహరి దగ్గర నుంచి సాయి(ధరమ్)తేజ్ ఓ కొత్త పద్దతి పెట్టుకున్నారు. తను చేయబోయే సినిమా ఏదయినా కథను మెగామామయ్య చిరంజీవికి చెప్పి, ఓకె చేయించుకోవడం.

ఈ మేరకు తేజు తరువాత సినిమా దర్శకుడు మారుతి కథను మెగాస్టార్ చిరంజీవికి నెరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనాలకు నచ్చే పాయింట్ తో కూడిన ఈ స్క్రిప్ట్ ను రెండున్నర గంటల పాటు మెగాస్టార్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బోగట్టా.

అలాగే మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా విని ఓకె చేసినట్లు తెలుస్తోంది. దీంతో సాయిధరమ్ తేజ – మారుతి కాంబినేషన్ లో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే సినిమాకు అన్నీ రెడీ అయిపోయినట్లే. సత్యరాజ్, మురళీశర్మ, రావు రమేష్ లాంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించే ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక మాత్రం పెండింగ్ లో వుంది. థమన్ సంగీత దర్శకుడు.

వైఎస్ జగన్ సక్సెస్ ఫార్ములా అదే!