మహేష్ బాబు మూవీలో షాలినీ పాండే?

త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా షాలినీ పాండేను సెలక్ట్ చేశారట.…

త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా షాలినీ పాండేను సెలక్ట్ చేశారట. నిజానికి ఈమెను సెకెండ్ హీరోయిన్ అనేకంటే కీలక పాత్రధారి అంటే కరెక్ట్ అంటున్నారు.

అవును.. మహేష్ మూవీలో ఓ కీలకమైన పాత్ర కోసం అల్లరి నరేశ్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం షాలినీ పాండేను ఎంపిక చేశారట. ఈ రెండు పాత్రలు సినిమాను మలుపు తిప్పుతాయని.. మహేష్ బాబు తర్వాత సినిమాలో హైలెట్ అయ్యే పాత్రలు ఈ రెండే అంటూ ప్రచారం జరుగుతోంది.

అర్జున్ రెడ్డిలో ప్రీతి షెట్టిగా మెప్పించిన షాలినీ పాండే ప్రస్తుతం కోలీవుడ్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ రీమేక్ లో నటిస్తోంది. ఇటు తెలుగులో మహానటి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మహేష్ మూవీ ఆఫర్ పై మాత్రం ఆమె రియాక్ట్ అవ్వలేదు. హైదరాబాద్ లో ఓ అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన షాలిని.. త్వరలోనే ఓ బ్రేకింగ్ న్యూస్ చెబుతానని మాత్రం ప్రకటించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇదే కావొచ్చు.